రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శారదా ఛార్జిషీటులో చిదంబరం భార్య
Published on Tue, 01/05/2016 - 10:12
కోల్కతా: దేశంలో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణం కేసుకు సంబంధించిన ఛార్జిషీటులో మాజీ ఆర్థికమంత్రి పీ చిదంబరం భార్య నళిని చిదంబరం పేరును చేర్చారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం కోర్టు సమర్పించిన అదనపు ఆరో చార్జిషీటులో సీబీఐ అధికారులు నళిని పేరును చేర్చినట్లు ఆ శాఖ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అయితే, ఆమెను ఇందులో నిందితురాలిగా చేర్చారా లేక సాక్షిగా చేర్చారా అనే వివరాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం కేసు ఉన్న పరిస్థితిలో ఎలాంటి వివరాలు తెలిపేందుకు కూడా సీబీఐ అధికారులు నిరాకరించారు. 'శారదా కుంభకోణం కేసులో నిందితుడైన మనోరంజన సింగ్కు ఆమె(నళిని వ్యక్తిగత న్యాయవాది. శారదా సంస్థ ద్వారానే ఆమెకు ఫీజు చెల్లిస్తూ వస్తున్నారు' అని ఓ సీబీఐ అధికారి తెలిపారు.
#
Tags