amp pages | Sakshi

రాజ్యసభలో ‘తెలంగాణ’పై కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం

Published on Wed, 08/07/2013 - 02:41

తెలంగాణకు వ్యతిరేకంగా రాజ్యసభలో మంగళవారం రెండోరోజూ నిరసనలు కొనసాగాయి. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకుపోగా, రాష్ట్రానికి చెందిన మంత్రి ఒకరు ఈ అంశంపై ఒక ఎంపీతో వాగ్వాదానికి దిగారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలి’ అనే నినాదం రాసిన ప్లకార్డులు ధరించిన టీడీపీ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి వెల్‌లోకి దూసుకుపోయి, నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డితో మంత్రి జేడీ శీలం వాగ్వాదానికి దిగారు.
 
తెలంగాణకు చెందిన పాల్వాయి, సీమాంధ్ర సభ్యులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలని వ్యాఖ్యానించడంతో సీమాంధ్ర సభ్యులు తీవ్రంగా స్పందించారు. రెండు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటంటూ పాల్వాయిని మంత్రి శీలం నిలదీశారు. దీంతో ఇద్దరి నడుమ వాగ్యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ సభ్యురాలు రేణుకా చౌదరి మంత్రి శీలంకు మద్దతు పలికారు. అధికార పార్టీ సభ్యులు మంత్రి శీలం, ఎంపీ పాల్వాయిలకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈలోగా కాంగ్రెస్ సభ్యురాలు అంబికా సోనీ జోక్యం చేసుకుని, గొడవ పడొద్దంటూ వారికి నచ్చచెప్పడంతో వారి వాగ్యుద్ధం సద్దుమణిగింది.
 
అయితే, టీడీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు సాగించడంతో, డిప్యూటీ చైర్మన్ కురియన్ వారిని వారించారు. ఇలాగే సభకు అంతరాయం కొనసాగిస్తే, సస్పెండ్ చేయాల్సి ఉంటుందని వారిని హెచ్చరించారు. అయినా, ఫలితం లేకపోవడంతో వారిని సస్పెండ్ చేసేందుకు తీర్మానాన్ని ప్రతిపాదించాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ను ఆదేశించారు. అయితే, సభలో నిరసన తెలుపుతున్న సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తాము అంగీకరించేది లేదని ఏఐఏడీఎంకే నేత మైత్రేయన్, విపక్షనేత అరుణ్ జైట్లీ, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓబ్రియన్ సహా పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
దీంతో డిప్యూటీ చైర్మన్ కురియన్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. కాగా, ప్రభుత్వమే రభసను కొనసాగిస్తోందని విపక్షనేత అరుణ్ జైట్లీ ఆరోపించారు. తెలంగాణ అంశంపై పాలకపక్షంలోనే ఏకాభిప్రాయం లేదని, అయినా హడావుడిగా తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించాయని ఆయన విమర్శించారు. 
 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)