amp pages | Sakshi

లంచావతారులపై నిఘా

Published on Sun, 11/23/2014 - 02:44

 అమాత్యుల సహాయకుల  ఆమ్యామ్యాలు
తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం

 సాక్షి, భువనేశ్వర్:  కుంభకోణాల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఒకవైపు నవీన్ సర్కార్‌ను చుట్టుముడుతుంటే, మరోవైపు కొందరు మంత్రుల పీఎస్‌లు, పీఏలు లంచావతారులుగా మారడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంలో కొందరు అమాత్యుల కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి పనికి రేట్లు, కమీషన్లు పిండేస్తున్నారు. వివిధ పనులపై కార్యాలయాలకు వచ్చేవారితో పాటు కాంట్రాక్టర్లకు తెరవెనుక సాయం పేరుతో నేరుగా అధికారిక పనుల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఎవరైనా నిరాకరిస్తే మంత్రి పేరు చెప్పి బెదిరిస్తున్నారు. సహాయకుల దందాల జోరు ఎక్కువకావడంతో ప్రభుత్వం కళ్లు తెరిచింది. మంత్రుల వద్ద పనిచేసే అనధికారిక, అధికార పీఏలు, పీఎస్‌లపై నిఘా ఏర్పాటు చేయనుంది. వారితో సమావేశం నిర్వహించి హెచ్చరిక చేయాలని కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సూచించారు.

 అంతా వారే!
 సొంత పార్టీ నేతలు పలు అవినీతి అక్రమాలకు పాల్పడడం, మంత్రులు కూడా ఇష్టానుసారం వ్యవహరించడంతో పాటు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చూసీచూడనట్లు వ్యవహరించడం ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. చిట్‌ఫండ్ అక్రమాల్లో బీజేడీ ప్రముఖులు పలువురు చిక్కుకున్నారు. మంత్రుల వద్ద పని చేసే ప్రభుత్వ, వ్యక్తిగత సిబ్బంది, సహాయకులు, ఇతరులు తమ తమ స్థాయిలో పైరవీలకు పాల్పడుతున్నారు. వీరు చేసే కార్యక్రమాలకు మంత్రి పేరు ఉపయోగిస్తున్నారు. మంత్రిగారు చెప్పారంటూ సచివాలయం, ఇతర ప్రభుత్వ శాఖల్లోకి చొచ్చుకుపోతున్నారు. ఫలానా పని     చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నిజంగా మంత్రిగారు చెప్పారో లేదో కాని వారి సహాయకులు మాత్రం తమవద్దకు వచ్చిన వారి నుంచి రూ.లక్షల్లో కమీషన్లు పుచ్చుకుని బదిలీలు, పనులు, ఫైళ్లపై సంతకాల వరకు చక్కబెడుతున్నారు. దీనికితోడు కొందరు మైనింగ్‌కాంట్రాక్టర్లు, రోడ్లు, ఇతర నిర్మాణ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబంధించి కూడా నేరుగా అధికారులతో మాట్లాడుతున్నారు.

ఒకరిద్దరు పీఏలైతే కోట్లలో ఆస్తులు అర్జించినట్లు పలువురు అధికారులే చెబుతున్నారు. దీంతో సచివాలయంలో సామాన్యుల పనులు పక్కకు వెళ్లిపోయి పర్సంటేజీలు ఇచ్చినవారి పనులను పూర్తి చేస్తున్నారు. తమ సహాయక సిబ్బంది ఏం చేస్తున్నారో గమనించకపోవడం, తెలిసినా చూసీచూడనట్లు మంత్రులు వ్యవహరిస్తున్నారు. చివరికి పర్సంటేజీల వ్యవహారం ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమంతోంది. లంచావతారుల గురించి ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు సమాచారం. దీంతో వారిపై నిఘా పెట్టడంతో పాటు వారికి సంబంధించిన సమాచారం కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)