వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాజధానికి కాలుష్యం కాటు
Published on Mon, 10/15/2018 - 06:14
న్యూఢిల్లీ/చండీగఢ్: దేశ రాజధాని ఢిల్లీని ఈ ఏడాది కూడా వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేయనుంది. పొరుగునే ఉన్న పంజాబ్, హర్యానా రైతులు తమ పొలాల్లో వ్యర్థాలను తగులబెట్టడం ప్రారంభించారు. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యత ప్రస్తుతం మధ్యస్థం నుంచి అత్యల్పస్థాయికి పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ)’లో భాగంగా నేటి నుంచి అత్యవసర కార్యాచరణను అమలు చేయనున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తెలిపింది. వాయు నాణ్యత స్వల్ప నుంచి మధ్యస్థ స్థాయి వరకు ఉన్నట్లు గుర్తిస్తే గుంతలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలకు నిప్పుపెట్టడాన్ని అధికారులు నిషేధిస్తారు.
#
Tags