నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
ఎమ్మెల్యే పేపర్ మిల్లులో అత్యాచారం, హత్య
Published on Sat, 06/18/2016 - 12:07
లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఓ రాజకీయ పార్టీ ఎమ్మెల్యే కు చెందిన మిల్లులో ఓ దళిత మహిళ అత్యాచారం, హత్యఘటన కలకలం రేపింది. ముజఫర్ నగర్ లో ని పేపర్ మిల్లు లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీఎస్పీ ఎమ్మెల్యే కు చెందిన పేపర్ మిల్లులో పనిచేసే దళిత కార్మికురాలు (38) అనుమానాస్పద స్థితిలో మరణించింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ముజఫర్ నగర్ లోని జనసాత్ లో వున్న పేపర్ మిల్లులో పనిచేస్తున్న దళిత మహిళ శుక్రవారం శవమై తేలింది. ఇది బీఎస్పీ ఎమ్మెల్యే కు చెందినదనీ, ఆమెపై అత్యాచారం చేసిన గొంతు నులిమి చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. పరారీలో ఉన్న లేబర్ కాంట్రాక్టర్ కోసం గాలిస్తున్నామని, విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు తెలిపారు.
Tags