అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలకు బ్రేక్
Published on Fri, 12/14/2018 - 05:48
న్యూఢిల్లీ: ఆన్లైన్లో ఔషధాలు, మందుల అమ్మకాలను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మందుల ఆన్లైన్ అమ్మకాలపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ..‘ఆన్లైన్ అమ్మకాల కారణంగా ఔషధాలు దుర్వినియోగమయ్యే అవకాశముంది. నకిలీల బెడదతో సతమతవుతున్న ఈ–కామర్స్ సైట్లలో నాణ్యతలేని, కల్తీ మందులు సరఫరా అయితే రోగి ప్రాణానికే ప్రమాదం’ అని తెలిపారు. దీంతో ఈ విషయంలో అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్సీవో), ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కోర్టు నోటీసులు జారీచేసింది.
#
Tags