వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
నేవీ కేంద్రం వద్ద డ్రోన్ కలకలం
Published on Wed, 03/06/2019 - 10:09
చెన్నై: చెన్నైలోని నేవీ కేంద్రం మీదుగా డ్రోన్ వెళ్లడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఐఎన్ఎస్ అడయార్ క్యాంపస్ మీదుగా సోమవారం రాత్రి 9 గంటల సమయంలో గుర్తు తెలియని డ్రోన్ ఎగురూతూ వెళ్లినట్లు నేవీ సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించారు.
వారం రోజుల వ్యవధిలో గుజరాత్, రాజస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్కు చెందిన రెండు డ్రోన్లను భారత బలగాలు కూల్చిన సంగతి తెలిసిందే. పూల్వమా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని తీవ్రవాద తండాలపై భారత వైమానిక దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు వైమానిక దాడులకు తెగబడే అవకాశముందున్న నిఘా వర్గాల హెచ్చరికలతో అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
#
Tags