అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
గుండెపోటుతో కాదు గాయాల వల్లే ముండే మృతి
Published on Wed, 06/04/2014 - 18:18
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే మృతికి గల కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముండే తీవ్రంగా గాయపడటంతో పాటు గుండెపోటు రావడంతో చనిపోయారని ఎయిమ్స్ వైద్యులు తొలుత ప్రకటించారు. అయితే ముండేకు గుండెపోటు రాలేదని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. పోస్ట్మార్టం నివేదికను బుధవారం విడుదల చేశారు.
ముండే శరీరంలోపలి భాగాలకు గాయాలయినట్టు తేలింది. కీలకమైన భాగాలు దెబ్బతిన్నట్టు వెల్లడైంది. ఢిల్లీలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండే మరణించిన సంగతి తెలిసిందే. బుదవారం ముండే స్వరాష్ట్రం మహారాష్ట్రలో అంత్యక్రియలు నిర్వహించారు.
#
Tags