amp pages | Sakshi

‘రక్షణ నిధుల’ టాప్‌–5లో భారత్‌

Published on Tue, 12/13/2016 - 02:40

సౌదీ, రష్యాలను అధిగమించి పైకి..
అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికా, చైనా, బ్రిటన్‌
రెండేళ్లలో మూడోస్థానానికి భారత్‌... తాజా నివేదికలో వెల్లడి

లండన్‌: ప్రపంచంలో రక్షణ రంగానికి ఎక్కువగా నిధులు కేటాయించే టాప్‌–5 దేశాల జాబితాలో భారత్‌ చేరింది. సౌదీఅరేబియా, రష్యాలను మించి 50.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.34 వేల కోట్లు) మిలటరీ బడ్జెట్‌కు కేటాయించినట్లు తాజాగా వెల్లడైంది. రక్షణ రంగంలో అధికంగా ఖర్చుచేసే మొదటి మూడు దేశాల్లో అమెరికా, చైనా, బ్రిటన్‌ కొనసాగుతున్నాయి. వీటితర్వాత ఎక్కువగా నిధులు వెచ్చించే స్థానంలో భారత్‌ నిలిచిందని, ఆ తర్వాత సౌదీఅరేబియా, రష్యా ఉన్నాయని బ్రిటన్‌కు చెందిన ‘2016 జేన్స్‌ రక్షణ బడ్జెట్ల నివేదిక’వెల్లడించింది. దీన్ని ‘ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌’అధ్యయన సంస్థ విడుదల చేసింది.

భారత్‌ గత ఏడాది 46.6 బిలియన్‌ డాలర్లను ఖర్చుచేయగా, ఈ ఏడాది 50.7 బిలియన్‌ డాలర్లను ఖర్చుచేసింది. అయితే, 2018 నాటికి భారత్‌ మిలటరీ నవీకరణలో భాగంగా బ్రిటన్‌ను అధిగమించి మూడో స్థానానికి ఎగబాకుతుందని తెలిపింది. ఏ దేశానికి అందని రీతిలో అమెరికా ఏకంగా ఏటా 622 బిలియన్‌ డాలర్లను ఖర్చుపెడుతుండగా, చైనా 191.7 బిలియన్‌ డాలర్లను, బ్రిటన్‌ 53.8 బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తున్నాయి. సౌదీఅరేబియా 48.68 బిలియన్స్, రష్యా 48.44 బిలియన్‌ డాలర్లను రక్షణ రంగంపై ఖర్చుపెడుతున్నాయి. 2010లో 38 బిలియన్‌ డాలర్లు ఉన్న భారత రక్షణ బడ్జెట్‌ 2020 నాటికి 64 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ఆ సంస్థ అంచనావేసింది. ‘గత మూడు సంవత్సరాల్లో భారత్‌ ఆయుధాల సేకరణపై తగ్గించినా సిబ్బంది రూపంలో ఎక్కువ బడ్జెట్‌ వినియోగించింది.

2017 నుంచి మిలటరీ ఆధునీకరణపై భారత్‌ దృష్టి పెడుతుందని భావిస్తున్నాం. ఇందులోభాగంగా కొత్త పరికరాలు అవసరమవుతాయి. మూడేళ్ల తర్వాత రక్షణరంగ సరఫరాదారులకు భారత్‌ ముఖ్యదేశమవుతుంది’అని ఐహెచ్‌ఎస్‌ జేన్స్‌ ముఖ్యవిశ్లేషకుడు క్రెయిగ్‌ కేఫ్రీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా రక్షణకు వెచ్చించే నిధుల వినియోగం ఒక శాతం పెరిగి 1.6 ట్రిలియన్‌ డాలర్లకు చేరింది.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?