నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆవాస్ యోజన మరో 15 నెలలు పొడిగింపు
Published on Fri, 09/22/2017 - 19:47
సాక్షి,ముంబయిః ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన కింద మధ్యాదాయ వర్గాలకు ఇచ్చే రూ 2.60 లక్షల వడ్డీ రాయితీ పథకాన్ని మరో 15 నెలలు పొడిగించారు. ఈ ఏడాది డిసెంబర్తో ముగియనున్న ఈ స్కీమ్ను 2019 మార్చి వరకూ పొడిగించినట్టు అధికారులు తెలిపారు. 2022 నాటికి అందరికీ ఇల్లు ఆశయం నెరవేర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ను ప్రధాని గత ఏడాది తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విషయం విదితమే.
2022 నాటికి దేశ ప్రజలందరికీ ఇళ్లు సమాకూర్చే లక్ష్యంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ గృహాల నిర్మాణంలో బిల్డర్లు, ప్రైవేటు ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు.
#
Tags