amp pages | Sakshi

పంటల కనీస మద్దతు ధర సూత్రమిదే!

Published on Sat, 02/10/2018 - 02:20

న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) నిర్ణయించటంలో అనుసరించనున్న సూత్రాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. బడ్జెట్‌లో 2019 ఖరీఫ్‌ సీజన్‌లో పంట ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ‘వాస్తవ ఉత్పత్తి వ్యయం, రైతు కుటుంబసభ్యుల శ్రమ వ్యయాన్ని కలపగా వచ్చిన మొత్తానికి 50 శాతం అదనంగా చేర్చి మద్దతు ధరగా నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు. మద్దతు ధరపై అనుసరించిన విధానాన్ని వెల్లడించాలంటూ.. విపక్షాలు, వ్యవసాయ నిపుణులు డిమాండ్‌ చేసిన నేపథ్యంలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో శుక్రవారం జైట్లీ ఈ ప్రకటన చేశారు.

ప్రభుత్వం రైతుల వద్దనుంచి గోధుమ, వరి పంటలనే (రేషన్‌ షాపుల ద్వారా సబ్సిడీపై అందించేందుకు) సేకరిస్తున్నప్పటికీ.. 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించినప్పటికీ.. రైతులకు చేరటం లేదని జైట్లీ అంగీకరించారు. ‘రైతులకు ఎంఎస్‌పీ చేరాలనే లక్ష్యంతోనే బడ్జెట్‌లో ప్రతిపాదనలిచ్చాం. అన్ని పంటలకు ఒకే విధానాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. సాగుకు అయిన వ్యయం (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, నీటిపారుదల ఖర్చులు, చెల్లించిన కూలీలు.. ఇతరత్రా), రైతు కుటుంబసభ్యుల శ్రమకు విలువకట్టిన మొత్తాన్ని కలుపుకుని దీనికి ఒకటిన్నర రెట్ల మద్దతు ధర నిర్ణయించాం’ అని జైట్లీ వెల్లడించారు.

భయంకరమైన డాక్టర్‌ చేతుల్లో..
యూపీఏ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పదేళ్లపాటు ‘భయంకరమైన డాక్టర్‌’ చేతిలో ఉందని జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్‌ను చేర్చారని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంపై తీవ్ర విమర్శలు చేశారు. నిర్మాణాత్మక సంస్కరణల కారణంగా 2014 నుంచి భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని జైట్లీ పేర్కొన్నారు. యూపీఏ హయాంలో జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌ డెఫిసిట్‌లను సభకు వెల్లడించారు. ప్రస్తుత వివరాలను సభ్యులు అర్థం చేసుకోవాలన్నారు. కాగా, కేంద్ర బడ్జెట్‌ ప్రజలను మోసం చేసేదిగా ఉందని.. తృణమూల్, ఎస్పీ, సీపీఐ, ఎన్సీపీ, ఆప్‌ సభ్యులు మండిపడ్డారు. ఫేకూ ఫెడరలిజం (అవాస్తవ సమాఖ్య వ్యవస్థ), అహంకారాన్ని ఎన్డీయే ప్రదర్శిస్తోందని విమర్శించారు.

పార్లమెంటు వాయిదా
తీవ్రమైన నిరసనలు, సభ్యుల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయసభలు మర్చి 5కు వాయిదా పడ్డాయి. శుక్రవారం లోక్‌సభ ప్రారంభం కాగానే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. అటు రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వివరాలు వెల్లడించాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు కూడా వెల్‌లోకి దూసుకెళ్లటంతో తీవ్ర గందరగోళం నెలకొంది. నిరసనల మధ్యే కాసేపు సభను నడిపించిన స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌.. కొద్దిసేపటి తర్వాత మార్చి 5కు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల తొలి అర్ధభాగం ముగిసింది.  రాజ్యసభలోనూ బడ్జెట్‌పై చర్చ జరగకుండా ఏపీ ఎంపీలు అడ్డుకున్నారు. వెల్‌లోనే బైఠాయించారు. అయితే ఏపీ ఎంపీలను బయటకు పంపి బడ్జెట్‌పై చర్చ, జీరో అవర్‌ను నిర్వహించాలని తృణమూల్, కాంగ్రెస్‌ ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడును కోరారు. అయినా నిరసనలు ఆగకపోవటంతో వెంకయ్య సభను రెండుసార్లు వాయిదా వేశారు. బడ్జెట్‌పై చర్చ జరిగాక రాజ్యసభ మార్చి ఐదో తేదీకి వాయిదా పడింది.  

సీఏసీపీ సూచనల ప్రకారమే!
ప్రస్తుతం వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్‌ (సీఏసీపీ) సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ఎంఎస్‌పీని నిర్ణయిస్తుంది. ఈ సంస్థ మూడు సూత్రాలను ప్రభుత్వానికి సూచించింది. ఏ2 (విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, కూలీలు, ఇంధనం, నీటిపారుదల తదితర ఖర్చులు కలుపుకుని), ఏ2+ఎఫ్‌ఎల్‌ (ఏ2కు పంట ఉత్పత్తిలో పనిచేసినందుకు గానూ రైతు కుటుంబీకుల శ్రమను కలుపుకోవాలి), సీ2 (పై రెండు కలుపుకుని, పంటకోసం తన ఆస్తులు, బంగారం మొదలైనవి తాకట్టుపెట్టి తెచ్చిన మొత్తానికి వడ్డీ కలుపుకుని) అని మూడు వేర్వేరు విధానాలను ప్రతిపాదించింది. 2006లో వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్‌ స్వామినాథన్‌ నేతృత్వంలోని జాతీయ వ్యవసాయ కమిషన్‌ కూడా పంట వ్యయానికి (ఏ2+ఎఫ్‌ఎల్‌) 50 శాతం ఎక్కువ మద్దతు ధర సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ కూడా పంట ఉత్పత్తి వ్యయానికి 50 శాతం అధిక మద్దతు ధర చెల్లిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.  

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)