వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పూలకోసం వెళ్లిన 11 ఏళ్ల బాలికపై..!
Published on Thu, 01/07/2016 - 13:36
జంషెడ్పూర్: జార్ఖండ్లోని జంషెడ్పూర్లో కొత్త సంవత్సరం రోజున అమానుషం చోటు చేసుకుంది. పూలకోసం వెళ్లిన పదకొండేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులందించిన సమాచారం ప్రకారం.. బసదెరా గ్రామానికి చెందిన 11ఏళ్ల బాలిక కొత్తసంవత్సరం రోజున సమీపంలోని అడవిలోకి పువ్వులు తెంపుకోవడం కోసం వెళ్లింది. తిరిగి వస్తుండగా.. కొందరు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం తమ బండారం బయట పడకూడదని పాశవికంగా రాళ్లతో కొట్టి చంపేశారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు.
కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అంతా గాలించారు. చివరకు అడవిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. పూలకోసం వెళ్లిన తమ బిడ్డను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారన్న తల్లిదండ్రుల ఆవేదన గ్రామస్తులను కలిచిచేసింది. అయితే వారం రోజుల తరువాత గ్రామస్తుల సహాయంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ గ్రామానికి చెందినవారే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉంటారని వారు అనుమానిస్తున్నారు.
#
Tags