సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తెలంగాణలో 5 వేల మెగావాట్ల విద్యుత్
Published on Fri, 02/12/2016 - 17:49
న్యూఢిల్లీ : మూడు, నాలుగేళ్లలో తెలంగాణలో 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో పీయూష్ గోయల్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పీయూష్ గోయోల్ మాట్లాడుతూ... 2020 నాటికి రామగుండ ఎన్టీపీసీ ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామన్నారు.
అలాగే మణుగూరు ప్లాంట్ ద్వారా 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పారు. తెలంగాణలో మరిన్ని సోలార్ పార్కులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని పీయూష్ గోయోల్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో విద్యుత్ ప్రాజెక్టులపై కేసీఆర్తో చర్చించినట్లు పీయూష్ గోయల్ వెల్లడించారు.
#
Tags