amp pages | Sakshi

బొగ్గు క్షేత్రాల వేలంలో లొసుగులు

Published on Wed, 07/27/2016 - 02:06

- పార్లమెంట్‌కు కాగ్ నివేదిక
- గతేడాది వేలం వేసిన ఎన్డీఏ సర్కారు
 
 న్యూఢిల్లీ : గత ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు క్షేత్రాల ఈ-వేలంలో లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపింది. కార్పొరేట్ గ్రూపుల జాయింట్ వెంచర్లు, సబ్సిడియరీలుగా బిడ్లు వేయడంతో 11 క్షేత్రాలకు సంబంధించి జరిగిన వేలంలో పోటీతత్వానికి అడ్డుకట్ట పడినట్లయిందని మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదికలో పేర్కొంది. తొలి రెండు భాగాలకు సంబంధించి జరిగిన వేలంలో సామర్థ్య పోటీ అనేది ఆడిట్ లో కనిపించలేదని తెలిపింది. మొదటి రెండు భాగాల్లో 29 బొగ్గు క్షేత్రాల్లోని 11 క్షేత్రాలకు విజయవంతంగా ఈ-ఆక్షన్ పూర్తయిందని, ఈ వేలంలో పాల్గొన్న అర్హత గల బిడ్డర్లలో ఒకే కంపెనీకి చెందినవో లేదా సబ్సిడియరీ సంస్థగానో లేదా జాయింట్ వెంచర్లగానో పాల్గొన్నాయని తెలిపింది.

ఈ పరిస్థితులను బట్టి చూస్తే జాయింట్ వెంచర్లను స్టాండర్డ్ టెండర్ డాక్యుమెంట్ అనుమతించి.. అదే సమయంలో అర్హత గల బిడ్డర్లను పరిమితం చేసిందని పేర్కొంది. దీంతో రెండు భాగాల్లో సరైన పోటీ జరిగిందనే నమ్మకం ఆడిట్‌లో కలగలేదని కాగ్ చెప్పింది. ఇక మూడో భాగంలో ఎక్కువ మంది జాయింట్ వెంచర్లుగా పాల్గొనే ఉద్దేశంతో నిబంధనలను బొగ్గు శాఖ సవరించిందని తెలిపింది. కాగ్ రిపోర్ట్‌పై ఓ అధికారి స్పందిస్తూ.. అర్హత సాధించిన బిడ్డర్లలో 6 శాతం మాత్రమే జాయింట్ వెంచర్లు అని, వాటిలో ఒక్కటే విజయవంతమైన బిడ్డర్ అని చెప్పారు. కనుక ఆ నిబంధన పోటీని నిరోధించలేదనేది అర్థమవుతుందన్నారు.

 కాగ్ గుర్తించిన ఇతర అంశాలు...
 8 రైలు ప్రమాదాలను ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, ఫెన్సింగ్‌లాంటి ఏర్పాట్లతో నివారించాలని సూచించింది. 8 రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు వసతులు సరిగాలేవని, అలాగే అపరిశుభ్రత తాండవిస్తోందని ఆక్షేపించింది. 8 రూ.18,845 కోట్ల వ్యయంతో అమెరికా నుంచి తెప్పించిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ అనే ఆధునిక రవాణా విమానాలను సరిగా వినియోగించకపోవడాన్ని కాగ్ ఎండగట్టింది. 8 మిగ్-29కే యుద్ధ విమానాలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని కాగ్ పేర్కొంది.

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)