amp pages | Sakshi

ఉద్యోగులకు మహారాష్ట్ర కీలక ఆదేశాలు

Published on Fri, 06/05/2020 - 17:50

ముంబై: లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో మహారాష్ట్ర మహా వికాస్‌ అఘాడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారానికి కేవలం ఒక్కసారైనా కార్యాలయాలకు వచ్చి హాజరు నమోదు చేసుకోవాలని ఆదేశించింది. లేనిపక్షంలో జీతంలో కోత విధించనున్నట్లు హెచ్చరించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్‌ శౌనిక్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. రోస్టర్ల ప్రకారం ప్రభుత్వోద్యోగులు ఆఫీసుకు రావాలని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా సెలవు తీసుకున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.(మహారాష్ట్రలో 2710కి చేరిన కోవిడ్‌ మృతుల సంఖ్య)

ఈ మేరకు..‘‘అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా అధికారులు, ఉద్యోగుల పనివేళలకు సంబంధించిన రోస్టర్లు సిద్ధం చేయాలి. సెలవు మంజూరైన, మెడికల్‌ లీవులో ఉన్న వారు తప్ప ప్రతీ ఒక్క ఉద్యోగి వారానికి ఒక్కరోజైనా కచ్చితంగా కార్యాలయానికి రావాలి’’అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అదే విధంగా విభాగాధిపతుల అనుమతి లేకుండా సెలవు తీసుకున్న వారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు.. ఆ వారం మొత్తం జీతాన్ని కట్‌ చేస్తామని స్పష్టం చేశారు. అంతేగాకుండా వారంలో ఒక్కసారైనా ఎవరైతే ఆఫీసుకు వస్తారో.. అందుకు సంబంధించిన మొత్తం జీతం వారి ఖాతాల్లో జమవుతుందని.. అనుమతితో గనుక సెలవు తీసుకుంటే సెలవు దినానికి మాత్రమే జీతంలో కోత ఉంటుందని తెలిపారు. (పుణె పోలీసుల వినూత్న ప్రయోగం!)

ఇక ఈ నిబంధనలు జూన్‌ 8 నుంచి అమల్లోకి వస్తాయని.. లాక్‌డౌన్‌ పొడగింపు నేపథ్యంలో నెలాఖరు వరకు ఇదే పద్ధతిని పాటించాల్సింది ఉంటుందని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్రలో కరోనా ఉధృతి రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గురువారం ఒక్కరోజే అక్కడ 123 మంది మృత్యువాత పడ్డారు. దీంతో ఉద్యోగులు విధుల్లో చేరేందుకు జంకుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా స్వస్థలాల్లో ఉండిపోయిన కొంతమంది ఇంతవరకు ఆఫీస్‌లో రిపోర్టు చేయలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఉద్ధవ్‌ ఠాక్రే సర్కారు ఈ మేరకు కొత్త నిబంధనలు విధించింది. ఇక లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)