నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దుండగుల దుశ్చర్య : గాంధీ విగ్రహం కూల్చివేత
Published on Mon, 06/17/2019 - 16:10
భువనేశ్వర్ : ఒడిసాలోని బాలాసోర్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మహాత్మ గాంధీ విగ్రహం నేలమట్టమైంది. గాంధీ జ్ఞాపకార్ధం స్కూలులో కేటాయించిన ఓ గదిని సైతం దుండగులు ధ్వంసం చేశారు. గది పరిసరాల్లో సిగరెట్ ప్యాకెట్లు, తాగిపడేసిన మద్యం బాటిళ్లను చిందరవందరగా పడేశారు. స్కూల్లోకి ప్రవేశించిన దుండగులు గాంధీ విగ్రహాన్ని నేలకూల్చి, తల భాగాన్ని కిందపడవేశారు.
కాగా, జూన్ 14న ఈ ఘటన జరిగి ఉంటుందని, వేసవి సెలవల కారణంగా స్కూల్ను మూసివేసిన క్రమంలో దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని స్ధానిక పోలీస్ అధికారి సుభాన్షు శేఖర్ నాయక్ పేర్కొన్నారు. స్దానికుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని చెప్పారు.
#
Tags