టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్
Breaking News
ప్రేయసి మరో యువకుడితో స్నేహం చేస్తోందని..
Published on Wed, 09/26/2018 - 10:37
సాక్షి, న్యూఢిల్లీ : తన ప్రియురాలు వేరే యువకుడితో స్నేహం చేస్తోందని ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంత పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. రివాజ్ ఖాన్ (20) అనే యువకుడు ఓ మైనర్ బాలికను గత 11 నెలలుగా ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక గతకొంత కాలంగా వేరే యువకుడితో చనువుగా ఉంటోందని ఆమెపై కక్ష పెంచుకున్నాడు. మంగళవారం సాయంత్ర ఇదే విషయంపై ఇద్దరి మధ్య స్పల్ప వాగ్వాదం జరిగింది. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు.
అంతేకాకుండా శవాన్ని రెండు ముక్కలుగా చేసి గొనె సంచిలో ప్యాక్ చేసి సమీపంలోని బారాపుల్లా ఫ్లైఓవర్ కిందగల మురికి కాలువలో పడేశాడు. హత్యచేసిన అనంతరం తానే స్వయంగా వెళ్లి పోలీసుల వద్ద లొంగిపోయాడు. తన ప్రేయసి వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న కారణంతో ఆమెను హత్య చేశానని పోలీసుల ముందు ఒప్పుకోవడంతో.. కేసు నమోదు చేశారు. అతని సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు.
Tags