amp pages | Sakshi

‘రిపోర్టింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి’

Published on Wed, 04/22/2020 - 13:35

న్యూఢిల్లీ : దేశంలోని పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ(ఐ అండ్‌ బీ) పలు సూచనలు జారీచేసింది. కరోనాకు సంబంధించిన వార్తలు కవర్‌ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులను కోరింది. ఈ మేరకు బుధవారం ఐ అండ్ ‌బీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలోని పలు ప్రాంతాల్లో రిపోర్టింగ్‌ చేస్తున్న మీడియా ప్రతినిధుల్లో చాలా మందికి కరోనా సోకినట్టుగా తమ దృష్టికి వచ్చింది. కరోనాకు సంబంధించి వార్తలు సేకరిస్తున్న మీడియా ప్రతినిధులు(రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఫొటోగ్రాఫర్‌లు‌..) కంటైన్‌మెంట్‌ జోన్లు, హాట్‌స్పాట్స్‌, కరోనా ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. అలా వెళ్లే మీడియా ప్రతినిధులు వారి విధులు నిర్వర్తించేటప్పుడు ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే క్షేత్రస్థాయిలో వార్తలను సేకరిస్తున్న రిపోర్టర్‌లతోపాటుగా ఆఫీసులో పనిచేసే సిబ్బందికి సంబంధించి మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేసింది. 

కాగా, దేశంలో ఇప్పటికే పలువురు మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు, చైన్నెలోని ఓ టీవీ చానల్‌లో పనిచేస్తున్న 27 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. దీంతో ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వాలు మీడియా ప్రతినిధులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. 

చదవండి : న్యూస్‌ ఛానల్‌లో పని చేస్తున్న 27 మందికి కరోనా

జ‌ర్న‌లిస్టుల‌ను వ‌ణికిస్తున్న క‌రోనా: ఒక్క‌రోజే 53 మందికి..

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)