వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మోదీ మ్యాజిక్ ఏమైంది?
Published on Fri, 05/20/2016 - 16:11
ముంబై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఉత్సాహంగా ఉన్న బీజేపీపై మిత్ర పక్షం శివసేన మరోసారి విమర్శలు చేసింది. అస్సాంలో బీజేపీ విజయం సాధించడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మ్యాజిక్ అనుకుంటే మరి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో ఎందుకు అధికారంలోకి రాలేకపోయిందని అధికార పత్రిక 'సామ్నా'లో ప్రశ్నించింది.
ప్రాంతీయ పార్టీలపై గెలుపొందడం అంత సులువుకాదన్న విషయాన్ని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని తెలిపింది. అస్సాంలో కాంగ్రెస్ పార్టీపై గెలుపొందారని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లోని ప్రాంతీయ పార్టీల కంచుకోటలను తాకలేకపోయారని పేర్కొంది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చరమగీతం పాడిన ప్రజలు, అచ్చేదిన్ ప్రభుత్వానికి ఒక్క సీటును మాత్రమే ఇచ్చారని 'సామ్నా'లో విమర్శించింది.
#
Tags