amp pages | Sakshi

గుజరాత్ అల్లర్లపై ‘నానావతి’ నివేదిక

Published on Wed, 11/19/2014 - 05:43

గాంధీనగర్: గుజరాత్ అల్లర్లపై దర్యాప్తునకు నియమించిన జస్టిస్ నానావతి కమిషన్ మంగళవారం తన రెండో, తుది నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌కు అందజేసింది. కమిషన్ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత, 24 పొడిగింపుల అనంతరం దీన్ని సమర్పించారు. దర్యాప్తునకు రూ. 7 కోట్లు ఖర్చయ్యాయి. క మిషన్‌కు సాక్షుల వాంగ్మూలాలతో కూడిన 45 వేల అఫిడవిట్లు అందాయి. కమిషన్ సారథి, సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ జీటీ నానావతి, సభ్యుడైన హైకోర్టు రిటెర్డ్ జడ్జి అక్షయ్ మెహతాలు సీఎం ఇంటికి చేరుకుని 2 వేల పేజీల నివేదికను సమర్పించారు. అయితే అందులోని అంశాలను వెల్లడించడానికి నానావతి నిరాకరించారు. వాటిని బయటపెడితే తమ కమిషన్‌కు రాష్ట్ర అసెంబ్లీ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని విలేకర్లతో అన్నారు.

 

నివేదికను బహిర్గతం చేయాలో, వద్దో నిర్ణయించుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. నివేదికకు ఎందుకు జాప్యం జరిగిందో చెప్పడానికి నిరాకరించారు. తమ విచారణలో చాలామంది సాక్ష్యం ఇవ్వటానికి ముందుకు రాలేదని తెలిపారు. 2002 నాటి గుజరాత్ అల్లర్లలో  అత్యధికంగా మైనారిటీలు సహా వెయ్యిమందికిపైగా బలవటం తెలిసిందే. నాటి హింసకు సంబంధించి అప్పటి సీఎం, నేటి ప్రధాని నరేంద్ర మోదీ, నాటి రాష్ట్ర మంత్రులతోపాటు ప్రభుత్వ యంత్రాంగం పాత్ర, మతఛాందసవాద సంస్థల పాత్రను నిగ్గుదేల్చడానికి 2002లో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిషన్‌ను నియమించింది. ఇది 2008లో ఇచ్చిన తొలి నివేదికలో.. గోధ్రారైలు దహనం పథకం ప్రకారం జరిగిందని పేర్కొంటూ, మోదీకి, అప్పటి రాష్ట్ర మంత్రులకు క్లీన్‌చిట్ ఇచ్చింది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)