amp pages | Sakshi

అమృత్‌సర్‌ రైలు ప్రమాదం.. సిద్ధూ పెద్దమనసు

Published on Tue, 10/23/2018 - 11:19

చంఢీగర్‌ : దసరా ఉత్సవాల్లో భాగంగా అమృత్‌సర్‌ నగర శివార్లలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వందలాది మంది ప్రజలు రైలు పట్టాలపై నిల్చుని రావణ దహనాన్ని వీక్షించే క్రమంలో రైలు వారిని ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికే 61 మంది దుర్మరణం చెందగా మరో 57 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంజాబ్‌ మాజీమంత్రి నవజోత్‌కౌర్‌ సిద్దూ హాజరయ్యారు. (‘మేడమ్‌..! 500 ట్రైన్‌లు వచ్చినా భయపడరు’)

నవజోత్‌కౌర్‌ కళ్లెదుటే ఈ ఘోర ప్రమాదం జరగడం దురదృష్టకరమని పంజాబ్‌ మంత్రి, ఆమె భర్త నవజోత్‌సింగ్‌ సిద్దూ విచారం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకుంటామని వెల్లడించారు. వారికి ఉన్నత విద్యాసంస్థల్లో చదువు చెప్పిస్తానని తెలిపారు. అలాగే, ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోయిన మహిళలను ఆర్థికంగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తొలి విడతగా పంజాబ్‌ ప్రభుత్వం సోమవారం నష్టపరిహారాన్ని పంపిణీ చేసింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 21 కుటుంబాలకు ఆర్థిక సాయం చేసినట్టు కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ మంత్రి బ్రామ్‌ మోహింద్రా తెలిపారు. మిగతా కుటుంబాలకు మరో రెండు రోజుల్లో నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

(చదవండి : అమృత్‌సర్‌ ప్రమాదం : సెల్ఫీల గోలలో పడి)

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)