amp pages | Sakshi

‘డ్రాగన్‌కు దీటుగా బదులిచ్చాం’

Published on Sun, 06/28/2020 - 11:36

సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దు వివాదంలో చైనా దూకుడుకు దీటుగా బదులిచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. డ్రాగన్‌ సేనలతో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 20 మంది సైనికుల త్యాగాలను కొనియాడారు. మనం సుఖంగా జీవించేందుకు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారని ప్రస్తుతించారు. ప్రధాని మోదీ ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో మాట్లాడుతూ లడఖ్‌లో చైనా సైనికులను దీటుగా నిలువరించామని అన్నారు. దేశం స్వయం సమృద్ధి సాధించేలా పౌరులంతా చొరవ చూపాలని పిలుపు ఇచ్చారు.

స్ధానిక ఉత్పత్తుల వాడకానికే మొగ్గుచూపాలని కోరారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకుంటూ రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్‌ బలోపేతమవుతోందని అన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధి కోసం భారత్‌ పాటుపడుతోందని చెప్పారు. కోవిడ్‌ నియమాలను అనుసరించకుంటే ప్రమాదంలో పడతామని హెచ్చరించారు. ఈ ఏడాది మనకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని అన్నారు. ప్రపంచమంతా వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించగా, ఇమ్యూనిటీని పెంచేవన్నీ భారత్‌లో ఎప్పటినుంచో వాడుతున్నవేనని గుర్తించాలన్నారు.

పీవీకి నివాళి

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నేతకు ఘనంగా నివాళులర్పించారు. భారతదేశ రాజకీయాలపై పట్టుతో పాటు పాశ్చాత్య ఆలోచనల్లో బాగా ప్రావీణ్యం కలవారు పీవీ నరసింహారావని కొనియాడారు. చరిత్ర, సాహిత్యం, విజ్ఞానశాస్త్రంలో ఆయనకు చాలా ఆసక్తి. భారతదేశపు అత్యంత అనుభవజ్ఞులైన నాయకులలో ఒకరైన పీవీకి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. సంక్లిష్ట సమయంలో దేశానికి నాయకత్వం వహించిన పీవీ గొప్ప రాజకీయ నేతే కాకుండా పండితుడని అన్నారు. చదవండి : భారత్‌ గట్టిగా పోరాడుతోంది: మోదీ

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌