amp pages | Sakshi

వారు చితక్కొట్టడంతోనే నా కొడుకు ఉగ్రవాదయ్యాడు

Published on Sat, 02/16/2019 - 11:02

శ్రీనగర్‌ : మూడేళ్ల క్రితం భారత బలగాలు తన కొడుకును చితక్కొట్టడంతోనే మిలిటెంట్‌ గ్రూప్‌లో చేరాడని సూసైడర్‌ బాంబర్‌, ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ తల్లిదండ్రులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆదిల్‌ ఆత్మహుతికి దాడికి తెగబడి 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదిల్‌ ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకొని జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిపై దుండగుడు ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ తల్లిదండ్రులు రాయిటర్స్‌ ప్రతినిధితో మాట్లాడారు.

ఈ ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకున్న బాధే తమకు ఉందని ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ తండ్రి గులామ్‌ అహ్మద్‌ దార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.  2016లో తన కొడుకు అతని స్నేహితులు స్కూల్‌ నుంచి తిరిగి వస్తుండగా.. భారత సైనికులు అడ్డుకొని చితక్కొట్టారని, ఈ ఘటనతోనే ఆదిల్‌ ఉగ్రవాద గ్రూప్‌ల పట్ల ఆకర్షితుడయ్యాడని తెలిపాడు. అప్పటి నుంచి భారత సైనికులపై కోపం పెంచుకున్నాడని అతని తల్లి ఫహమీదా పేర్కొంది. ఇక తన కొడుకు ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదని, ఈ దాడి వ్యూహం తమకు తెలియదన్నారు. గతేడాది మార్చి 19 నుంచి ఆదిల్‌.. పని చేసే చోటు నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి జాడలేడన్నారు. అతని జాడ కోసం మూడు నెలలుగా ప్రయత్నించి ఆశ చాలించుకున్నామన్నారు. తన కొడుకు మరణానికి దేశంలోని రాజకీయనాయకులే కారణమని, కశ్మీర్‌ సమస్యపై తేల్చకుండా నాన్చుతున్నారని గులామ్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఈ అంశం తేలే వరకు.. తమలాంటి పేదల పిల్లలు, భారత జవాన్ల ప్రాణాలు పోతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!)

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?