చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి
Published on Sat, 06/02/2018 - 05:15
సాక్షి ముంబై: మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న తవేరా కారును ఓ ట్రక్కు ఢీకొనడంతో 11 మంది మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులతోపాటు నలుగురు మహిళలున్నారు. అర్ని పోలీసు స్టేషన్ పరిధిలోని కోస్దాని ఘాట్లో శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బాధితులు నాందేడ్లోని గురుద్వారాను దర్శించుకునేందుకు తవేరాలో బయల్దేరినట్లు తెలిసింది. ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో తవేరా ముందు భాగం నుజ్జునుజ్జయింది. క్షణాల్లోనే బాధితుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags