వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తల్లిదండ్రులను చూడకపోతే శాలరీ కట్
Published on Wed, 02/08/2017 - 16:18
ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు అస్సాం ప్రభుత్వం బాసటగా నిలిచింది. పెంచి ప్రయోజకులను చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగులపై కొరడా ఝుళిపించనుంది. వయసు పైబడిన వారి బాగోగులు చూడని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి అందించనుంది. ఈ మేరకు అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత బిశ్వా సర్మా మంగళవారం జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేశారు.
2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుని సదరు ఉద్యోగి వేతనం నుంచి కొంత మొత్తాన్ని కట్ చేసి అతని తల్లిదండ్రులకు ఇస్తుందని తెలిపారు. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకోవడం ప్రతి బిడ్డ బాధ్యత అని చెప్పారు.
#
Tags