విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పట్నాలో పేలుడు కలకలం
Published on Mon, 02/10/2020 - 10:35
సాక్షి, న్యూఢిల్లీ : పట్నాలోని గాంధీ మైదాన్ ప్రాంతంలోని ఓ ఇంటిలో సోమవారం ఉదయం జరిగిన పేలుడులో 12 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో దాదాపు ఐదు ఇళ్లు దెబ్బతిన్నాయి. పేలుడులో గాయపడినవారిని పట్నా మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందచేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా పేలుడుకు కారణాలేమిటన్నది ఇంకా తెలియరాలేదు.
ఘటనాస్ధలానికి చేరుకున్న అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. కాగా ఇంటిలో దాచిన బాంబు పేలడంతో సమీపంలోని ఇళ్లు ధ్వంసమైనట్టు తెలుస్తోందని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని పట్నా పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
చదవండి : హుబ్లీ రైల్వే స్టేషన్లో పేలుడు
#
Tags