అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎమ్మెల్యేకు సీజేఐ కథ, జరిమానా
Published on Fri, 02/10/2017 - 19:14
న్యూఢిల్లీ: 23 సంవత్సరాల క్రితం ఓ మేగజిన్లో రాసిన ఆర్టికల్పై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు వెళ్లిన ఎమ్మెల్యేకు ప్రధాన న్యాయమూర్తి భారీగా జరిమానా విధించారు. బీహార్లోని ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ 1994లో తనపై నియచక్ర మేగజిన్లో ప్రచురితమైన ఆర్టికల్పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన సీజేఐ జేఎస్ ఖెహర్.. ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టులో పిటిషన్ వేయడంపై రవీంద్రను ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇచ్చిన రవీంద్ర.. 2013లో తాను ఆ ఆర్టికల్ను చదివానని చెప్పారు.
పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... కోర్టు పిటిషన్ను తీసుకునేందుకు తిరస్కరించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానానికి తృప్తి చెందని న్యాయమూర్తి పిటిషన్ అమూల్యమైన కోర్టు సమయాన్ని వృథా చేసిందని అన్నారు. ప్రజాప్రతినిధి ఉండి చట్టాన్ని దుర్వినియోగం చేయాకూడదని వ్యాఖ్యానించారు. ఏళ్ల తర్వాత పిటిషన్ను ఫైల్ చేసినందుకు పిటిషనర్కు రూ.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో నివ్వెరపోయిన రవీంద్రసింగ్ జరిమానాను రద్దు చేయాలని కోరారు. రవీంద్ర అభ్యర్ధనపై స్సందించిన సీజేఐ.. తాను విద్యార్థి దశలో ఉన్న సమయంలో హాస్టల్లో జరిగిన ఓ సంఘటను చెప్పారు.
హాస్టల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ విద్యార్థికి రూ.25 జరిమానా విధించారని చెప్పారు. సంపన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు తక్కువ జరిమానా విధించింనందుకు సదరు విద్యార్థి వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిపారు. జడ్జి చెప్పిన కథతో కోర్టులో నవ్వులు పూశాయి. ఆ విద్యార్థిలాగే రవీంద్ర కూడా రూ.10 లక్షల జరిమానాకు ఇంకొంచెం ఎక్కువ చెల్లించాలని న్యాయమూర్తి అన్నారు.
#
Tags