రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాలికపై అత్యాచారం, ఆఫ్ఘన్ యువకులు అరెస్ట్
Published on Fri, 10/28/2016 - 20:24
కృష్ణరాజపుర(కర్ణాటక): మణిపూర్ రాష్ట్రానికి చెందిన పదహారేళ్ల బాలికపై ఇద్దరు విదేశీయులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన శుక్రవారం బెంగళూరులోని కృష్ణరాజపుర పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విద్యార్జనలో భాగంగా అఫ్ఘానిస్తాన్కు చెందిన ముస్తఫా జలాల్, కరం అబ్దుల్లా అహ్మద్ బెంగళూరు వచ్చారు. ఓ గదిలో అద్దెకు ఉంటున్నారు.
కృష్ణరాజపురలో నివాసం ఉంటున్న మణిపూర్కు చెందిన బాలిక ఈ నెల 26న టీసీపాళ్యలో స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాత్రి తిరిగి తన గదికి నడుచుకుంటూ వెళుతుండగా కారులో అటుగా వచ్చిన ముస్తఫా జలాల్, కరం అబ్దుల్లా గమనించారు. ఆ అమ్మాయిని డ్రాప్ చేస్తామంటూ వాహనంలో ఎక్కించుకున్నారు. అనంతరం గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం కష్ణరాజపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
#
Tags