రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘అలా అయితే ఎయిరిండియా మూత’
Published on Wed, 11/27/2019 - 14:37
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరించని పక్షంలో అది మూతపడుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించకుంటే దాన్ని నడిపేందుకు నిధులను ఎక్కడి నుంచి తీసుకురావాలని ఆయన ప్రశ్నించారు. ఎయిరిండియా విలువైన ఆస్తి అని దాన్ని విక్రయించదలుచుకుంటే మెరుగైన బిడ్డర్లు ముందుకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. మనం సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ మడి కట్టుకుని కూర్చుంటే ఎయిరిండియాను నడపడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. రాజ్యసభలో మాట్లాడుతూ పౌర విమానయాన మంత్రి హర్దీప్ పూరి ఈ వ్యాఖ్యలు చేశారు.
#
Tags