amp pages | Sakshi

డ్రగ్స్‌ ఏవి?.. ఎలుకలు తినేశాయి..!

Published on Sat, 09/01/2018 - 08:52

న్యూఢిల్లీ : మన దేశంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న విభాగాలు అంటే ముందగా గుర్తుకు వచ్చేది వైద్యం విభాగం, న్యాయ విభాగం. డాక్టర్ల సంఖ్య, అలానే పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే అది విచారణకు రావాలంటే ఏళ్లు పడుతుంది. ఆ లోపు జీవితాలు, సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశాలు అధికం.  ఇందుకు ఉదాహరణగా నిలిచారు ఢిల్లీ పోలీసులు. కొన్నేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న మత్తు పదార్ధాలను కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు పోలీసులు ఆ డ్రగ్స్‌ని ఎలుకలు తినేశాయంటూ వింత సమాధానం ఇచ్చారు.

వివరాల ప్రకారం.. మూడు, నాలుగేళ్ల క్రితం ఫైల్‌ అయిన డ్రగ్స్‌ కేసులను విచారించడానికి సుప్రీంకోర్టు, జస్టిస్‌ మదన్‌ బీ. లోకూర్‌, జస్టిస్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఆయా కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను కోర్టుకు చూపించాల్సిందిగా ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. అందుకు పోలీసులు అప్పుడు  స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ ప్రస్తుతం తమ వద్ద లేవని.. వాటిని ఎలుకలు తినేశాయంటూ వింత సమాధానం ఇవ్వడంతో విస్తుపోవడం న్యాయమూర్తుల వంతయ్యింది. పోలీస్‌ స్టేషన్‌లో డ్రగ్స్‌ భద్రపరిచిన గదుల్లో ఎలుకలు ఉన్నాయని, అవే వాటిని తినేశాయని పోలీసులు చెప్పుకొచ్చారు.

గతంలో బిహార్‌ పోలీసులు కూడా ఇదే తరహా సమాధానం చెప్పారు. గతేడాది బిహార్‌లో కూడా పోలీసులు ఇలాంటి విచిత్రమైన సమాధానమే చెప్పారు. అక్రమంగా స్వాధీనం చేసుకున్న మద్యాన్నంతా ఎలుకలు తాగుతున్నాయన్నారు. దాదాపు 9లక్షల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయని చెప్పారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)