amp pages | Sakshi

రైతులు ఏకమవ్వాలి

Published on Sat, 02/10/2018 - 18:00

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌) : సమస్యలు, డిమాండ్ల సాధనకై ఎర్రజొన్న, పసుపురైతులు ఏకమై ప్రభుత్వంతో పోరాడాలని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ , ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లా నుండి ప్రారంభమయ్యే ఈ పోరాటం రాష్ట్ర స్థాయికి చేరి ఇతర రైతులకు ఆదర్శంగా నిలువాలని ఇందుకు టీజేఏసీ ఎల్లప్పుడు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట ఎర్రజొన్న, పసుపు పంటలకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తు రైతు జేఏసీ తలపెట్టిన మహాధర్నాకి హజరైన కోదండరాం మాట్లాడారు. గింజలు కొని వ్యాపారం చేసే వారు బాగుపడుతున్నారని, గింజలు ఉత్పత్తిచేసే రైతులు మాత్రం బాగుపడకుండా బట్టిలోనే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం స్పందించే వరకు రైతులు ఐక్యంగా ఉండి హైదరాబాద్‌ స్థాయిలో పోరాటానికి రావాలని ఇందుకు టీజేఏసీ తోడుంటుందని హామి ఇచ్చారు.

చీఫ్‌ సెక్రటరీని కలిసి ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలపై విన్నవించడానికి సహకారం అందిస్తామన్నారు. త్వరలోనే ఆర్మూర్, బాల్కొండ నియోజక వర్గాలో పర్యటించి రైతుల పరిస్థితులను తెలుసుకుంటామని తెలిపారు. అనంతరం రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రైతుల సమస్యలపై పట్టింపులేదని జిల్లా ఎంపీ పార్లమెంట్‌లో మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు జేఏసీ కమిటీ చైర్మన్‌ దేవరాం, కన్వీనర్‌ రఘుపతిరెడ్డి, చంద్రమోహన్, రామకృష్ణ, గంగాధర్, భాస్కర్, లింబారెడ్డి, రాజేశ్వర్, సాయరెడ్డి, రమేష్, నరేష్, రైతులు పాల్గొన్నారు.
 
చక్కెర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోవాలి 
బోధన్‌ టౌన్‌(బోధన్‌): తెలంగాణ ప్రాంతానికి తలమానికంగా నిలిచి, ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన నిజాం చెక్కర కర్మాగారాన్ని స్వాధీనం చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ హాయాంలో ఇచ్చిన సభాసంఘం నివేదికను అమలు చేయాలని, టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకొని నడిపించాలని తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ చైర్మన్‌ ప్రొ.కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్‌డీఎస్‌ఎల్‌ రక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షా శిభిరాన్ని సందర్శించిన కోదండరామ్‌ దీక్ష పరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప జేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ లేఆఫ్‌ ప్రకటించడం పద్దతి కాదని, కార్మికులకు 25 నెలలుగా వేతనాలు చెల్లించకుండా యాజామాన్యం, ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఫ్యాక్టరీ నడవక, వేతనాలు లేని ఆందోళనలో నలుగురు కార్మికులు అనారోగ్యంతో మృతి చెందారని, వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రక్షణ కమిటీ చేపట్టిన ఈ దీక్షలకు తమ మద్దత్తు ఉంటుదని, జిల్లా జేఏసీ సభ్యులు రక్షణ కమిటీకి అండగా నిలిచి ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. ఆయన వెంట జిల్లా జేఏసీ కన్వీనర్‌ భాస్కర్, పీవోడబ్ల్యూ జాతీయ నాయకురాలు సంధ్య, రక్షణ కమిటీ కన్వీనర్‌ రాఘవయ్య, నాయకులు బి.మల్లేష్, నాయకులు షేక్‌ బాబు, సుల్తాన్‌ సాయిలు,  కార్మికులు, రైతులు ఉన్నారు. 

Videos

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)