amp pages | Sakshi

రియల్‌ మోసం

Published on Mon, 01/22/2018 - 09:31

కామారెడ్డి క్రైం: నిబంధనలను తుంగలో తొక్కి దందా చేస్తున్న పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. డబుల్‌ రిజిస్ట్రేషన్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఒకే స్థలాన్ని వేరువేరు వ్యక్తులకు అమ్ముతున్నారు. అధికారులు వారితో కుమ్మక్కై రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తుండడంతో సామాన్యులు నష్టపోతున్నారు. వెంకటస్వామి అనే వ్యక్తి గ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో పొట్టచేతబట్టుకుని 15 ఏళ్ల క్రితం కామారెడ్డికి వలస వచ్చాడు. రాత్రనక, పగలనక కష్టపడి కొన్ని డబ్బులు పోగు చేశాడు. సొంతింటి కల నెరవేర్చుకోవడం కోసం దేవునిపల్లి శివారులో 200 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. భూమి పూజ చేయగానే ఓ వ్యక్తి ‘‘ఇది నా స్థలం’’ అంటూ అడ్డుకున్నాడు. దీంతో వెంకటస్వామి ఈ విషయమై స్థలాన్ని అమ్మిన వ్యక్తిని నిలదీశాడు. సదరు రియల్టర్‌ స్పందించకపోవడంతో మనస్తాపం చెంది ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకోవడానికి యత్నించాడు. స్థానికులు అడ్డుకుని అతడిని కాపాడారు. ఈ సంఘటన ఇటీవల కామారెడ్డి పట్టణంలో చోటు చేసుకుంది. ఇలా ఎంతో మంది అమాయక ప్రజలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను నమ్మి నిలువునా దోపిడీకి గురవుతున్నారు.  

జిల్లా కేంద్రంలో తరచూ రియల్‌ ఎసేŠట్‌ట్‌ మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డబుల్‌ రిజిస్ట్రేషన్‌ మోసాలు ప్లాట్లు కొనుగోలు చేసేవారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. సొంతింటి కలను నెరవేర్చుకునే క్రమంలో రూ. లక్షల్లో నష్టపోతున్నారు. దీంతో కొత్త వ్యక్తి దగ్గర స్థలం కొనుగోలు చేయాలంటే సామాన్య ప్రజలు జంకుతున్నారు. అక్రమార్కులతో సంబంధిత అధికారులూ కుమ్మక్కవ డం వల్లే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.

బై నంబర్లతో డబుల్‌ రిజిస్ట్రేషన్‌లు
అక్రమార్కులు ఒక స్థలానికి సంబంధించిన సర్వే నంబర్లకు బై నంబర్లు వేస్తూ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారు. ఒక స్థలాన్ని మొదట ఒక వ్యక్తికి అమ్మిన తర్వాత తిరిగి అదే స్థలాన్ని ఈ పద్ధతిలో సృష్టించిన డాక్యుమెంట్లతో మరొకరికి విక్రయిస్తున్నారు. ఒక స్థలాన్ని ముగ్గురు నలుగురికి విక్రయించిన ఉదంతాలూ ఉన్నాయి. సామాన్య ప్రజలకు డాక్యమెంట్ల విషయంలో సరైన అవగాహన ఉండదు. దీనిని మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. లింక్‌ డాక్యుమెంట్లు పక్కాగా ఉంటేనే ప్లాట్లుగానీ, ఇతర స్థలాలు గానీ కొనుగోలు చేయాలనే విషయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.  

అధికారుల అండతోనే!
ఒకేస్థలాన్ని చూపించి ఇద్దరు ముగ్గురికి అంటగడుతున్న మోసగాళ్లకు అధికారుల అండ ఉందన్న ప్రచారం జరుగుతోంది. రిజిస్ట్రేషన్, రెవెన్యూశాఖల అధికారులు నకిలీ డాక్యుమెంట్ల సృష్టి, ఆన్‌లైన్‌ వ్యవహారాల్లో అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లకు సంబంధించిన రికార్డులు ముందుగానే ఆన్‌లైన్‌లో వచ్చేలా ఎంట్రీ చేస్తూ రిజిస్ట్రేషన్‌లు పూర్తికాగానే ఆన్‌లైన్‌లోనుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లోౖ నెతే సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయాల్లోనే బై నంబర్లు సృష్టిస్తూ అక్రమ రిజి  స్ట్రేషన్‌లకు పాల్పడుతున్నారని సమాచారం.  

సెటిల్‌మెంట్ల పేరుతో గుంజుడు..  
డబుల్‌ రిజిస్ట్రేషన్‌లు, నకిలీ పత్రాలతో స్థలాలు కొని మోసపోయిన వారు ఇదేమిటని ప్రశ్నిస్తే.. తప్పించుకోవాలని చూస్తున్నారు. పదేపదే అడిగితే సెటిల్‌మెంట్ల పేరుతో మరింత గుంజుతున్నారు. చేసేదిలేక, ఎదిరించలేక బాధితులు ఎంతోకొంతో ముట్టజెబుతున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంతోనైనా ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడుతుందా అన్నది తేలాల్సి ఉంది. సర్వేనంబర్ల విషయంలో బైనంబర్లను తొలగించడం, ఒకే నంబరు విధానాన్ని తీసుకువస్తే ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.

తప్పుగా ఉంటే తిరస్కరిస్తున్నాం
వచ్చే ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు వస్తే వాటిని తిరస్కరిస్తున్నాం. ఎలాంటి లొసుగులు ఉన్నా తిరస్కరించి కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నాం. కోర్టు ద్వారా ఏదైనా అడిగితే సమాచారాన్ని కోర్టుకే నేరుగా ఇస్తాం. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. రిజిస్ట్రేషన్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం.  – మల్లికార్జున్, సబ్‌రిజిష్ట్రార్, కామారెడ్డి

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)