amp pages | Sakshi

ఎన్నారై ఓటు.. తీసికట్టు

Published on Thu, 03/21/2019 - 11:34

కోటీ ముప్పై లక్షలు.. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య ఇది. ఓటర్లుగా నమోదు చేసుకున్నది మాత్రం కేవలం 71 వేల మంది మాత్రమే! తాజా ఓటర్ల జాబితా ప్రకారం చూస్తే ఇందులో 92 శాతం మంది కేరళీయులే!! ఆశ్చర్యంగా ఉందా? అయినా ఇదే వాస్తవం. తమకు ఓటు హక్కు కల్పించాలని ఎన్నారై సంస్థలు చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ అంశంపై ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. చివరకు 2010లో ప్రజాప్రాతినిధ్య చట్టానికి మార్పులు చేసి వీరికీ ఓటుహక్కు కల్పించారు. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకూ ఓటర్లుగా నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య మరీ నత్తనడకన సాగుతోందంటే అతిశయోక్తి కాదు. ఇతర దేశాల్లో ఉంటూ పౌరసత్వం తీసుకోని భారతీయులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించగా.. 2012 నుంచి ఎన్నికల కమిషన్‌ ఈ జాబితాను ప్రచురించడం మొదలుపెట్టింది. అప్పటికి కేవలం పదివేల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

ఆరేళ్ల తరువాత అంటే 2018 నాటికి ఈ సంఖ్య 24,507కి చేరింది. ఇందులో 1,942 మంది మహిళలు. 2019 తాజా జాబితా ప్రకారం మాత్రం ఇది మూడు రెట్లు ఎక్కువై 71,735కు చేరుకుంది. ఇందులో 92 శాతం అంటే 66,584 ఓట్లు కేరళ నుంచి నమోదయ్యాయి. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో నమోదైన ఎన్నారై ఓటర్ల సంఖ్య 5,151. ఈ ఏడాది జాబితాలోని ఇంకో విశేషమేమిటంటే 20 మంది ఎన్నారై హిజ్రాలు కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడం. ఎన్నికల కమిషన్‌ ఎన్నారై ఓటర్ల నమోదును పెంచేందుకూ ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. నమోదు ప్రక్రియలోని సంక్లిష్టత కారణంగా ఎక్కువమంది మొగ్గుచూపడం లేదు. ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు రావాల్సి ఉండటం ఇంకో కారణంగా చెబుతున్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)