amp pages | Sakshi

మంత్రికి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుల వినతి పత్రం

Published on Thu, 02/22/2018 - 19:47

కువైట్ : వైఎస్‌ఆర్‌సీపీ కువైట్ కమిటీ సభ్యులు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్ష ద్వారా స్వస్ధలం వెళుతున్న వారికి ఆదుకోవాలని రాష్ట్ర మంత్రి కోల్లు రవీంద్రకు వినతి పత్రం అందించారు. కువైట్ ప్రభుత్వం జనవరి 29న ఆఖమా లేని వారు ఏజంట్ల చేతిలో మోసపోయి పాస్ పోర్ట్ లేనివారిపై ఎటువంటి కేసులు, జరిమానా లేకుండా వెళ్లి మళ్ళి కొత్త వీసాలకు అవకాశం కల్పించింది. దీంతో కువైట్‌లో ఉన్న తొమ్మిది వేల మంది అభాగ్యులు ఏడు సంవత్సరాల తరవాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటున్నారు. వారిలో టికెట్లకు డబ్బులు లేక అవస్ధలు పడుతున్న అభాగ్యలు ఎంతోమంది ఉన్నారు. అటువంటి అభాగ్యులను రాష్ట్ర  ప్రభుత్వం ఆదుకోవాలని గతంలో పత్రిక ముఖంగా గల్ఫ్, కువైట్ ప్రతినిధులు ఏపీఎన్‌ఆర్‌టీ,  ప్రభుత్వం పై విమర్శించగా ఎట్టకేలకు ప్రభుత్వం తరపున రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ మంత్రి  కొల్లు రవీంద్ర  ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్సీ తెలుగు చైర్‌పర్సన్ వేమూరి రవి ఈ నెల 20న  కువైట్ విచ్చేసిన సందర్బంగా తెలుగు వారి తరుపున  వైఎస్‌ఆర్‌సీపీ కువైట్  కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి కమిటీ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం తెలుగువారి కష్టాలపైన  వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా బాలిరెడ్డి మాట్లాడుతూ..  క్షమాబిక్ష సమయంలో ఇండియా వచ్చిన అభాగ్యులను అన్ని విధాలుగా ఆదుకొని వారికి  పునరావాసం కల్పించాలని కోరారు. ఇక్కడ నుంచి వెళ్లే పేద వారిని ప్రభుత్వ తరుపున టికెట్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. అలాగే మన తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ విమానాలు దిగేటట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మనవి చేశారు. 

కో కన్వినర్లు గోవిందు నాగరాజు ఎంవీ నరసారెడ్డి మాట్లాడుతూ.. కువైట్ లో పని చేస్తున్నపుడు అకస్మాత్తుగా మరణించిన వారి పార్ధవ శరీరాన్ని భారత దేశం లోని విమానాశ్రయం తమ స్వస్థలికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. కువైట్ వచ్చిన పేద బడుగు వర్గాల వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను రద్దు చేయవద్దని కోరారు. 

ప్రధాన కోశాధికారి నాయని మహేశ్వర్ రెడ్డి మీడియా ప్రతినిది మాట్లాడుతూ..  కువైట్ ప్రమాదంలో మరణించిన వారికీ, ప్రమాదంలో వికలాంగులు అయిన వారికీ భీమా ద్వారా ఆదుకోవాలన్నారు. దొంగ ఏజంట్ల నుంచి అమాయక ప్రజలను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు అబుతురాబ్, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ విభాగం లీడర్ రమణ యాదవ్, యువజన విభాగం లీడర్ మర్రి కళ్యాణ్, ఎస్సీ, ఎస్టీ విభాగం బీఎస్‌ సింహ, పిడుగు సుబ్బారెడ్డి, షేఖ్ సబ్దర్ తదితరులు పాల్గొన్నారు.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)