వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆస్తులు కాపాడుకోవడానికే బాబు జోలె
Published on Tue, 01/14/2020 - 04:57
సాక్షి, అమరావతి: చంద్రబాబు తన ఆస్తులు, తన బినామీల భూములు కాపాడుకోవడానికే జనం ముందుకు జోలె పట్టుకుని వస్తున్నారని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. హెరిటేజ్ ఆస్తులను కాపాడుకోవడానికి తన భార్యతో ఓ ప్లాటినం గాజును వేయించి.. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు, రైతుల వద్ద విరాళాలు అడుగుతున్నారని దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ వారి జీతాలను గానీ, ఇంటి అద్దె అలవెన్సును గానీ రైతుల ఉద్యమానికి విరాళంగా ఇవ్వలేదన్నారు.
#
Tags