amp pages | Sakshi

గ్యాలరీలో చంద్రబాబు ఎందుకు కూర్చున్నారు?

Published on Thu, 01/23/2020 - 17:21

సాక్షి, అమరావతి: అసెంబ్లీలో తీసుకున్న ప్రతి కీలక నిర్ణయాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో శాసనమండలి జరుగుతోందని, ఈ పరిస్థితుల్లో మండలి ఉండాలా? లేదా? అనే చర్చ జరగాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ, సీడీఆర్‌ఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి నివేదించిన అంశంపై ఆయన గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబునాయుడు మండలి గ్యాలరీలో కూర్చోవాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు.

‘శాసనమండలి గ్యాలరీలో చంద్రబాబు ఉన్నారని తెలిసి.. నేను కూడా ఆసక్తిగా వెళ్లాను. నిబంధనల ప్రకారం మండలిలో బిల్లులపై ఓటింగ్‌ జరుగుతుందని భావించా. కానీ చైర్మన్‌ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడం ఆశ్చర్యంగా అనిపించింది. సెలెక్ట్‌ కమిటీకి పంపాలంటే సవరణలు ప్రవేశపెట్టాలి కానీ, వాటిని ప్రవేశపెట్టలేదు. కాబట్టి ఓటింగ్‌ జరుగుతుందని భావించాం. కానీ, నిబంధనలకు విరుద్ధంగా చివర్లో చైర్మన్‌ విచాక్షణాధికారం అంటూ సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. వికేంద్రీకరణ బిల్లు ఇప్పుడప్పుడే చట్టం కాకూడదనే కుట్రతోనే సెలెక్ట్‌ కమిటీకి పంపారు. సెలెక్ట్‌ కమిటీకి నివేదించడం వల్ల రెండు, మూడు నెలల జాప్యం జరుగుతుంది. కానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు ఎంతకాలం ఆపగలరు’ అని అంబటి ప్రశ్నించారు.

రైతులను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు. శాసనసభ అమరావతిలో జరుగుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారని గుర్తు చేశారు. అమరావతి రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. వ్యవస్థలను దెబ్బతీయడంలో చంద్రబాబు దిట్ట అని, చంద్రబాబు ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి నిరోధకంగా శాసనమండలి మారుతున్నప్పుడు దాని కొనసాగింపుపై చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)