amp pages | Sakshi

ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేశారా?

Published on Sun, 11/18/2018 - 01:42

కరీంనగర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసిందా అని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. రీ డిజైనింగ్‌ పేరిట కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే అంచనాలు పెంచుతూ ప్రజాధనం దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం కరీంనగర్‌లో కేజీ టు పీజీ విద్యా సంస్థల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా సదస్సులో భట్టి మాట్లాడారు. ఈ ఎన్నికలు నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిందేమి లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట పెద్ద దోపిడీ జరిగిందని ఆరోపించారు. లక్షల కోట్లు దండుకుని అవినీతి సొమ్ముతో మరోసారి ఎలాగైనా అధికారం దక్కించు కోవాలని తహతహలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులే తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదన్నారు.  ఫాంహౌస్‌ సీఎంను సాగనంపాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పీడ వదుల్చుకునేందుకే మహాకూటమిగా జట్టు కట్టామని, కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు.  

ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించారు..
స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి మాట్లాడుతూ ఎన్నో ఆశలతో టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగిస్తే చేసిందేమి లేదని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేశారన్నారు. ఫాం హౌస్‌కు పరిమితమై పాలన సాగించిన కేసీఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడాలని ఆమె పిలుపునిచ్చారు.   సభలో కరీంనగర్, మానకొండూర్‌ అభ్యర్థులు పొన్నం ప్రభాకర్, ఆరెపల్లి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌