amp pages | Sakshi

ఏపీ రాజధానిపై మహాకుట్ర!

Published on Tue, 08/27/2019 - 13:10

సాక్షి, అమరావతి : ఏపీ రాజధానిపై మహాకుట్ర జరుగుతుంది. కుట్రకు సంబంధించిన కథ, స్క్రీన్‌ ప్లే, డైరెక్షన్‌ అంతా కరకట్ట నుంచే అందుతోంది. పక్కా ప్లాన్‌ ప్రకారమే టీడీపీ నేతలు అన్ని పార్టీలను కలుస్తూ..రాజధానిపై రాజకీయం చేస్తున్నారు. గుడ్డ కాల్చి ప్రభుత్వంపై వెయ్యడానికి చకచకా పావులు కదుపుతున్నారు. రాజధానిపై చంద్రబాబు చేస్తున్న కుట్రపై సాక్షిటీవీ ప్రత్యేక కథనం..

రాజధాని పేరుతో రైతులనుండి 33వేల ఎకరాలు లాక్కున్న చంద్రబాబు సర్కారు నాలుగున్నరేళ్లలో వారికి చేసిందేమీ లేదు. డజనుకు పైగా దేశాలు తిరుగుతూ జనం సొమ్మును దుబారా చేసిన చంద్రబాబు..ఏ దేశం వెళితే అలాంటి రాజధాని కడతానంటూ గొప్పలు చెప్పుకోవడం తప్ప రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కూడా కట్టలేకపోయారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాత్రం రాజధాని పేరుతో లూటీ చేసిన మాట మాత్రం వాస్తవం.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు డజనుకుపైగా హామీలిచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం..అందులో ఒక్క హామీ కూడా అమలు చెయ్యలేదు. అభివృద్ది చేసి ఇస్తామన్న ప్లాట్లు ఎక్కడున్నాయో రైతులకే తెలియదు. ఇక రాజధాని పేరుతో ఇన్ సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతూ చంద్రబాబు, ఆయన బినామీలు వందల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నారు. చంద్రబాబు తనకు నచ్చిన కంపెనీలకు తక్కువ ధరలకే భూములు కట్టబెట్టి భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక స్థానిక టీడీపీ నేతలు 29 గ్రామాల్లో గజం భూమిని కూడా వదల్లేదు. చెరువులు, కాలువలు, వాగులు, వంకలు, మిగులు భూములు, సీలింగ్ ల్యాండ్, ఎసైన్డ్ ల్యాండ్ ఇలా దేన్నీ వదలకుండా దోచేశారు.

రాజధాని  ప్రాంతం ముంపు పరిధిలో ఉంది కృష్ణానది ఉప్పొంగితే ఏం జరుగుతుందో తాజాగా వచ్చిన వరదలు కళ్లకు కట్టాయి. ఈ విషయాన్ని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. కుట్రలో భాగంగా టీడీపీ నాయకులతో పాటు వారికి వంతపాడే ఎల్లో మీడియా రాజధాని దొనకొండకు తరలిపోతుందంటూ రచ్చ చేస్తున్నారు. అయితే ఇదంతా పక్కాప్లాన్ ప్రకారమే జరుగుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

తన అనుకూల పత్రికల్లో రాయించడంతో పాటు తమ నాయకులతో రాజధాని తరలిపోతుందని గగ్గోలు పెట్టించిన చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. మొన్నటివరకూ రాజధాని గ్రామాల్లో టీడీపీ నాయకులుగా ఉంటూ కోట్లు సంపాదించిన వారందరినీ ఇప్పుడు పావులుగా ఉపయోగించుకుంటున్నారు. చంద్రబాబు ప్లాన్ ప్రకారం వీరంతా రాజధాని రైతుల పేరుతో అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవడం, తమకు మద్దతివ్వాలని కోరడం జరుగుతుంది. చంద్రబాబు ప్లాన్ లో భాగంగానే తుళ్లూరు మండలానికి సంబందించిన దాదాపు డజను మంది టీడీపీ నేతలు కొంతమంది టీడీపీ కార్యకర్తలతో ఏపీ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి రాజధానిని తరలించేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలబడాలని కోరారు. బీజేపీ నేత కన్నా చుట్టూ ఉన్న అనుచరులు మాత్రం నిన్నటివరకూ కన్నాను తిట్టి ఇప్పుడు తమ సమస్యలకు అండగా నిలబడాలంటూ కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కన్నా లక్ష్మీనారాయణను కలవడంతో ఆగని చంద్రబాబు బ్యాచ్ ఆ వెంటనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కలిసింది. రాజధానిని తరలించేస్తున్నారు.. తమకు అండగా నిలబడాలంటూ సేమ్ డైలాగ్ రిపీట్ చేశారు. దీన్ని చూసి జనసేనకార్యకర్తలు మండిపడుతున్నారు. మూడేళ్లక్రితం రాజధాని ప్రాంతంలో పవన్‌కల్యాణ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఈ బ్యాచ్‌..ఇప్పుడు అదే పవన్‌ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరడంపై జనసేనలో చర్చ జరుగుతుంది. ఇక ఇదే టీం బీజేపీ నేత సుజనా చౌదరిని కూడా కలిసింది. అయితే వీరంతా పాత మిత్రులే కావడంతో ఎవరూ ఈ మీటింగ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు.చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈ గ్రూపు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తుండడంపై పెద్ద కుట్ర జరుగుతుందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతుంది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చెయ్యకపోయినా జనంలో గందరగోళం సృష్టించి రాజకీయ లబ్ది పొందడానికి చంద్రబాబు అండ్ టీం చేస్తున్న ఈ కుట్రను ప్రజలు అర్దం చేసుకోవాలని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)