amp pages | Sakshi

ఇక దేశం మొత్తం మాదే.. : అమిత్‌ షా

Published on Sat, 03/03/2018 - 16:59

సాక్షి, న్యూఢిల్లీ : లెఫ్ట్‌ పార్టీ ఈ దేశానికి రైట్ ‌(సరైనది) కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. బీజేపీకి ఇది చాలా సంతోషకరమైన రోజు అని, 21 రాష్ట్రాల్లో తాము అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఒడిశా, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి వస్తే ఇక బీజేపీకి స్వర్ణయుగమే అని ఆయన అన్నారు. శనివారం త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ రాష్ట్రాల ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం దాదాపు ఖరారైన నేపథ్యంలో నేపథ్యంలో అమిత్‌షా మీడియాతో మాట్లాడారు.
 
'ఇది బీజేపీకి చారిత్రాత్మక రోజు. ప్రధాని మోదీ విధానాలకు అందిన విజయం ఇది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ జెండా ఎగురుతుంది. మూడు రాష్ట్రాల కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. 2013లో త్రిపురలో మాకు 1.3శాతం ఓట్లు మాత్రమే లభించాయి. ఇప్పుడు 43 స్థానాలు గెలుస్తున్నాం. త్రిపురలో పలువురు కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారు. త్రిపుర వాసులు వామపక్షాల నుంచి విముక్తి కోరుకుంటున్నారు. త్రిపుర, నాగాలాండ్‌లో కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేక పోయింది. మాపై నమ్మకంతో ఓట్లు వేసిన త్రిపుర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి ఓటింగ్‌ శాతం పెరిగింది. ఇక కర్ణాటకలో భారీ మెజార్టీ లక్ష్యంగా బరిలోకి దిగుతాం. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి మాలక్ష్యం. దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.

నాగాలాండ్‌లో కూడా అధికారంలోకి వస్తాం. దేశంలోని ఏ ప్రాంతానికి కూడా లెఫ్ట్‌ (వామపక్ష పార్టీలు) రైట్‌ (సరైనది) కాదు. త్రిపుర ఓటర్లు మార్పునకు పట్టంకట్టారు. మేఘాలయలో మెజార్టీ రాకున్నా అక్కడి ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు. వచ్చే ఎన్నికలకు ఈ ఫలితాలు దిక్సూచిలాంటివి. నాలాంటి బీజేపీ కార్యకర్తలకు చాలా సంతోషకరమైన రోజు. దేశంలోని 21 రాష్ట్రాల్లో మేం అధికారంలో ఉన్నాం. ప్రతి రోజు ప్రధాని నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వానికి అనుకూలత పెరుగుతోంది. దేశంలో పశ్చిమ దిక్కున చాలా అభివృద్ధి చెందింది కానీ, అలాంటిది తూర్పు దిక్కు లేదని 2014లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఆ వెంటనే ఆయన 'యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ'ని ప్రారంభించారు. ఆయన విధానాలే ఈ భారీ విజయాన్ని అందించాయని మేం నమ్ముతున్నాము. ఇక ఒడిశా, బెంగాల్‌, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కూడా మేం అధికారంలోకి వస్తే బీజేపీకి ఇక స్వర్ణయుగమే' అని అమిత్‌ షా అన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌