amp pages | Sakshi

‘కోడెల అక్కడ అంతసేపు ఉండటమే తప్పు’

Published on Sun, 04/14/2019 - 20:28

సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రం వద్ద ఎక్కువసేపు ఉండటమే ఆయన చేసిన తప్పని వైఎస్సార్‌ సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోడెల చేసిన తప్పును వదిలేసి తమ నేతలపైన కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ రోజు జరిగిన టీడీపీ దాడులపై వైఎస్సార్‌ సీపీ నేతలు ఆదివారం గుంటూరు ఎస్సీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులకు దిగారన్నారు.

టీడీపీ నేతలపై కాకుండా తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని తెలిపారు. తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. మేరుగ నాగార్జునపై హత్యాయత్నం జరిగిందని, కారు అద్దాలు ధ్వంసం చేశారని వెల్లడించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

బూత్‌ను క్యాప్చర్‌ చేసేందుకు కోడెల ప్రయత్నించారు
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని వైఎస్సార్‌ సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. బూత్‌ను క్యాప్చర్‌ చేసేందుకు కోడెల ప్రయత్నించారని అన్నారు. కోడెల తీరుపై ఇనిమెట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారని తెలిపారు. కోడెల అరాచకాలను అడ్డుకున్న గ్రామస్తులపై కేసులు పెట్టారని, విచారణ చేయకుండానే తమపై కేసులు పెట్టారన్నారు. గురజాలలో అధికార పార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు.

Videos

టీడీపీ సర్పంచ్ కి 11 లక్షల సంక్షేమ పథకాలు...అది సీఎం జగన్ సంస్కారం..

విశాఖపై టీడీపీ కొత్తరాగం

పేదలపై చంద్రబాబు పెత్తందారీ కుట్ర

సముద్రంలో చేపలు పట్టిన KA పాల్

నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..

బాచుపల్లిలో ఘోర ప్రమాదం

మేము ఎప్పుడో గెలిచాం..మెజారిటీ కోసం చూస్తున్నాం..

నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్

సర్వే పై సంచలన విషయాలు బయటపెట్టిన కెఎస్ ప్రసాద్..

బూతు అస్త్రం ప్రయోగిస్తున్న బాబు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?