amp pages | Sakshi

అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుంది

Published on Wed, 10/30/2019 - 04:49

సాక్షి, అమరావతి: తొలి మంత్రివర్గ సమావేశంలోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 13 లక్షల మంది బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. చంద్రబాబు సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం సంక్షోభం నుంచి పరిష్కారాన్ని వెతికారని తెలిపారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ సమావేశం జరిగింది. హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. రూ.20 వేల లోపు డిపాజిట్లు చేసిన బాధితులందరికీ ప్రభుత్వం చెల్లింపులు చేస్తుందని.. దీనివల్ల 65 శాతం మందికి న్యాయం జరుగుతుందన్నారు.

మాట ప్రకారం బాధితులను ఆదుకున్నారు: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయం చేస్తారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇచ్చిన మాట ప్రకారం బాధితులను సీఎం ఆదుకున్నారన్నారు. బాధితులకు చెల్లించడానికి రూ. 1,150 కోట్లు కేటాయించారని తెలిపారు. గ్రామ సచివాలయాల ద్వారా చెల్లించడానికి ప్రయత్నం చేస్తామన్నారు.

ప్రైవేటు సంస్థ మోసం చేస్తే బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు చేయడం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ కేసులను సత్వరం పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ.. ఒక్క బాధితుడికి కూడా చంద్రబాబు ప్రభుత్వం న్యాయం చేయలేదన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్‌ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిధులు కేటాయించడం పట్ల బాధితులు సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు చెబుతున్నారన్నారు. 

Videos

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)