amp pages | Sakshi

ఐఏఎస్‌లకు ఏం తెలుసు?

Published on Sat, 05/09/2020 - 04:02

విశాఖలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ఐదుగురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేస్తే వాళ్లేం చేస్తారు? ఐఏఎస్‌ అధికారులకు సబ్జెక్ట్‌ తెలుసా? సైంటిఫిక్, టెక్నికల్‌ అంశాలు వాళ్లకి తెలియవు. వాళ్ల గురించి నాకు తెలియదా? ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న నాకే స్టైరీన్‌ అంటే ఏంటో తెలియదు. ఇక ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుంది. నేను ఉండిఉంటే నేరుగా ఫ్యాక్టరీలోకే వెళ్లేవాడిని.    
– చంద్రబాబు, ప్రతిపక్ష నేత

సాక్షి, అమరావతి: విశాఖలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ఐదుగురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేస్తే వాళ్లేం చేస్తారని ప్రతిపక్ష నేత  చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐఏఎస్‌ అధికారులకు సబ్జెక్ట్‌ తెలుసా? అని ప్రశ్నించారు. సైంటిఫిక్, టెక్నికల్‌ అంశాలు వాళ్లకి తెలియవన్నారు. వాళ్ల గురించి తనకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న తనకే స్టైరీన్‌ అంటే ఏంటో తెలియదని, ఇక ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుందన్నారు. మేధావులు దీనిపై అధ్యయనం చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ఏపీలో ఎంపిక చేసిన మీడియాతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

ప్రపంచంలో ఎక్కడా జరగలేదు..
► కోటి రూపాయలతో మనిషి మళ్లీ బతికివస్తాడా? రూ.కోటి సరిపోతాయా? డబ్బులివ్వమని ఎవరైనా అడిగారా?
► గ్యాస్‌ లీకేజీ ఘటనను సీఎం చాలా లైట్‌గా తీసుకున్నారు. ఆయనది అవగాహనా లోపం. తూతూమంత్రంగా ఒక కమిటీ వేస్తే ఎలా? నిపుణులతో అధ్యయనం చేయించాలి. బాధితుల ఆరోగ్య సంరక్షణను కొద్దికాలం పరిశీలించి చూడాలి. 
► ఘటనపై నిజ నిర్ధారణ కోసం టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నిమ్మల రామానాయుడితో త్రిసభ్య కమిటీని నియమిస్తున్నాం.
► ఇది మామూలు ప్రమాదం కాదు. ఇంతవరకూ ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దీన్ని ప్రభుత్వం హ్యాండిల్‌ చేసిన విధానం చూసి చాలా బాధేసింది. 
► ఒక నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకుని చూడాలి తప్ప ఫ్యాక్టరీని దృష్టిలో పెట్టుకోకూడదు. అవగాహనా రాహిత్యం ఉంది. అందుకే హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఎన్‌జీటీ కూడా సుమోటోగా తీసుకుని రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయమంది. వెంటనే ఫ్యాక్టరీని మూసివేయాలి. అవసరమైతే వేరేచోటకి మార్చాలి. 

నిపుణులతో మాట్లాడా..
► ఈ సీఎం ఎవరు చెప్పినా వినరు. ఇలాంటప్పుడు పదిమందితో మాట్లా డాలి. నేను ఉండుంటే నేరుగా ఫ్యాక్ట రీలోకే వెళ్లేవాడిని. ఒకవేళ గ్యాస్‌ ప్రభా వం ఉంటే తగ్గాకే వెళ్లాలి. ఎవరితోనూ మాట్లాడ కుండా కలెక్టర్‌ చెప్పాడని ఏదో చెప్పేస్తే ఎలా? 
► ఇందులో మీ సొంత పాండిత్యం ఏమిటి? సబ్జెక్ట్‌ నిపుణులతో కమిటీ వేయాలి. 
► సీఎంలు అన్నింటిలో నిపుణులు కాదు. ఇది అధికార, పరిపాలనా యంత్రాంగం వైఫల్యం.     
► గ్యాస్‌ లీకేజీపై నేను చాలామంది సబ్జెక్ట్‌ నిపుణులతో మాట్లాడా. ఇది మానవ తప్పిదమా? సాంకేతిక ప్రమాదమా అనేది తేల్చాలి. 
► లాక్‌డౌన్‌ తర్వాత ప్రమాదకరమైన ఇలాంటి ఫ్యాక్టరీని తెరిచేటప్పుడు తనిఖీ చేసి అనుమతి ఇవ్వాల్సింది.
► ఈ ఘటన తర్వాత రాత్రి నాకు నిద్ర రాలేదు. అక్కడికి ఎందుకు వెళ్లలేకపోయానా అని బాధపడ్డా. వెళ్లేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. కేంద్రం అనుమతి కోరా. అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడు వెళతా. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)