amp pages | Sakshi

ఇక సగం సమయం పార్టీకే

Published on Sat, 10/20/2018 - 04:20

సాక్షి, అమరావతి: ఇకపై ప్రతి రోజూ సగం సమయం పార్టీకే కేటాయిస్తానని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి వ్యక్తమవుతుంటే పార్టీపై ఆమేరకు సంతృప్తి శాతం ఎందుకు పెరగడం లేదని టీడీపీ నేతలను చంద్రబాబు ప్రశ్నించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో ఓటర్ల నమోదు, మండలి ఎన్నికలు, బూత్‌ కన్వీనర్ల శిక్షణ, గ్రామవికాసం కార్యక్రమాల గురించి ఆయన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. 

విపక్షాలపై ఎదురు దాడి చేయండి...
టీడీపీ మిషన్‌ 2019 ఎన్నికలు అని చంద్రబాబు పేర్కొన్నారు. 45,920 బూత్‌ కన్వీనర్లకు శిక్షణ 67 శాతం పూర్తయిందని, మిగతాది వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామవికాసం కార్యక్రమాలు ఇప్పటిదాకా 30 శాతం మాత్రమే జరిగాయన్నారు. పట్టభద్రుల కౌన్సిల్‌ ఎన్నికల్లో ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని సూచించారు. తుపాను నష్టాన్ని పరిశీలించేందుకు బీజేపీ నాయకులెవరూ రాలేదన్నారు. తక్షణ సాయంగా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ రెచ్చగొట్టి అడ్డంకులు కల్పిస్తోందని, పవన్‌కళ్యాణ్‌ ఒడ్డున ఉండి గడ్డలు వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేటీఆర్‌ వేరే రాష్ట్రం నుంచి పవన్‌ను అభినందిస్తున్నారని విమర్శించారు. ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడి చేయాలని టీడీపీ నేతలను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో సహాయ చర్యలను అడ్డుకునేందుకు వైఎస్సార్‌ సీపీ కుట్రలు చేస్తున్నట్లు చెప్పాలని, కిరాయి మనుషులతో సహాయ చర్యలకు అడ్డంకులు కల్పించాలని చూశారని ప్రచారం చేయాలన్నారు. 

పాదయాత్ర చిత్తశుద్ధితో చేయట్లేదు..
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు ప్రజల్లో స్పందన లేదని, ఆయన  ఫ్యాక్షన్‌ మనస్తత్వమే దానికి కారణమని చంద్రబాబు ఆరోపణలు చేశారు. పాదయాత్రను చిత్తశుద్ధితో చేయడం లేదని, డ్రామాగా చేస్తున్నారని చెప్పారు. ఇలాగే మరో నాలుగేళ్లు నడిచినా ఫలితం రాదన్నారు. వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, జనసేన, టీఆర్‌ఎస్‌ పార్టీలను ఎంత టార్గెట్‌ చేస్తే టీడీపీకి అంత లాభమని, ఆ నాలుగు పార్టీలూ కలిసిపోయినట్లుగా ప్రచారం చేయాలని సూచించారు. 

తిత్లీ బాధితులకు ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజీల విరాళం రూ.కోటి
ఉద్దానంలో రూ.10 కోట్ల ప్రాథమిక వ్యయంతో కిడ్నీ జబ్బుల పరిశోధనా కేంద్రం, ప్రత్యేక ఆస్పత్రి నిర్మిస్తామని ఏపీ ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ తెలిపింది. అసోసియేషన్‌ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలసి తిత్లీ తుపాను బాధితుల సాయం కోసం  రూ. కోటి విరాళంగా అందించారు. సీఎంను కలిసిన వారిలో ప్రైవేట్‌ మెడికల్‌ అండ్‌ డెంటల్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు నరసరాజు, సభ్యులు లక్ష్మణరావు, శాంతిరాముడు, కృష్ణప్రసాద్, మణి అక్కినేని, రసూల్, ఆలపాటి రవి, దొరస్వామి నాయుడు తదితరులున్నారు. 

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)