amp pages | Sakshi

దీపావళి నాడే ఆ దేశ వస్తువులు వాడొద్దంటారు కానీ..

Published on Tue, 10/29/2019 - 16:29

సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ, నోట్ల రద్దు వంటి నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరిగిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ ఆరోపించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ్‌ మాట్లాడుతూ.. నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాల వల్ల దేశియ ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఇలాగే ఉంటే స్టీల్‌, పారామెడికల్‌,పుడ్‌ ప్రాసెసింగ్‌, ఈ కామర్స్‌ రంగాలపై మరింత ప్రభావం ఉంటుందని ట్రేడ్‌ కౌన్సిల్‌ హెచ్చరించినా.. నరేంద్రమోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.

నిత్యవసర వస్తువులపై టాక్స్‌ పెంచి లగ్జరీ వస్తువులపై టాక్స్‌ తగ్గించడం దారుణమన్నారు. మోదీ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. 2022లోపు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ.. ఉన్న ఆదాయాన్ని తగ్గిస్తున్నారని మండిపడ్డారు. మేక్‌ ఇన్‌ ఇండియాను సేల్‌ ఇన్‌ ఇండియాగా మార్చారని ఎద్దేవా చేశారు. దీపావళి సమయంలో మాత్రమే బీజేపీ నేతలు చైనా వస్తువులను వాడొద్దని ప్రచారం చేస్తారని, కానీ మిగిలిన సమయంలో మళ్లీ వారి ప్రభుత్వమే టాక్స్‌ లేకుండా చైనా వస్తువులను దిగుమతి చేసుకుంటుందని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను కాంగ్రెస్‌ పార్టీ పట్టించుకోదని గౌరవ్‌ అన్నారు. 

Videos

మీ బిడ్డ విజయాన్ని దేవుడు కాకుండా ఇంకెవ్వడు ఆపలేడు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?