amp pages | Sakshi

కాంగ్రెస్‌ పార్టీ అనూహ్య నిర్ణయం

Published on Fri, 05/25/2018 - 10:02

సాక్షి, న్యూఢిల్లీ: గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సమస్యల నేపథ్యంలో విరాళాల కోసం ప్రజల దగ్గర చెయ్యి చాచుతోంది. మీ వంతు సాయం చెయ్యండంటూ గురువారం సాయంత్రం అధికారిక ట్విటర్‌లో ఓ ప్రకటన చేసింది. ‘కాంగ్రెస్‌కు మీ సహకారం, మద్ధతు అవసరం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటే మాకు సాయం చెయ్యండి. మీకు తోచినంత సాయం చెయ్యండి’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది.

కాగా, కాంగ్రెస్‌ పార్టీకి గత కొన్నేళ్లుగా కార్పొరేట్‌ డొనేషన్లు భారీగా తగ్గిపోయాయన్న విషయం ఏడీఆర్‌(Association for Democratic Reforms) నివేదిక తెలియజేసింది. 2014 తర్వాత ఇది మరీ ఎక్కువైపోవటం.. పైగా అది వరుస ఎన్నికల్లో ప్రభావం చూపుతూ వస్తోందని ఆ నివేదిక పేర్కొంది. కాగా, 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. (కర్ణాటకలో జేడీఎస్‌ పొత్తు వేరే విషయం). 2016-2017 ఏడాదిగానూ రూ.225.36 కోట్లు విరాళాల రూపంలో పార్టీకి చేరిందంట. ఇక బీజేపీ రూ. 1,034 కోట్లతో ధనిక పార్టీగా నిలిచింది. 

ఇక కాంగ్రెస్‌ క్రౌడ్‌ఫండింగ్‌కు వెళ్తుందన్న విషయాన్ని ఆ పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ ఇన్‌ఛార్జీ రమ్య స్పందన, సీనియర్‌ నేత శశిథరూర్‌లు ముందస్తుగానే తెలియజేశారు. బుధవారం శశిథరూర్‌ తన ట్విటర్‌లో ఓ పోస్ట్‌ కూడా చేశారు. నిధుల సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్‌ ప్రజల సహకారం కోరటం తప్పని భావించటం లేదు. ఎందుకంటే బీజేపీ డబ్బు రాజకీయాలను ఎదుర్కోవాలంటే అది తప్పనిసరి  అని థరూర్‌ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇప్పటికే పలువురు నేతలకు నిధుల కోరతతో అలవెన్సులు సైతం రద్దు చేసినట్లు సమాచారం. మరో వైపు రమ్య కూడా ఆన్‌ లైన్‌ విరాళాల సేకరణ ద్వారా పారదర్శకత ఉంటుందనే విషయాన్ని గతంలో తెలియజేశారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)