amp pages | Sakshi

వాయిస్‌ ఆఫ్‌ ఇండియా కాంగ్రెస్‌!

Published on Sun, 07/22/2018 - 13:14

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం ఆదివారం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ భారత ప్రజల వాణి (వాయిస్‌ ఆఫ్‌ ఇండియా) అని, దేశ వర్తమానం, భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌ పార్టీ కీలక పాత్ర పోషించాల్సిన అవసరముందని రాహుల్‌గాంధీ ఈ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేస్తూ పేర్కొన్నారు. అణగారిన వర్గాలకు అండగా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

రాహుల్‌ పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆయన అధ్యక్షతన జరుగుతున్న తొలి సీడబ్ల్యూసీ సమావేశం ఇది. వారం కిందట కొత్త సీడబ్ల్యూసీ ఏర్పాటైన విషయం తెలిసిందే. 23 మంది సభ్యులతో ఏర్పాటైన సీడబ్ల్యూసీ దృష్టంతా ప్రస్తుతం ఎన్నికల సన్నద్ధతపైనే ఉంది. ఈ ఏడాది చివర్లో మూడు రాష్ట్రాలతోపాటు వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ఎజెండాను, వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. రాహుల్‌ నాయకత్వంలో సంకీర్ణ కూటమిని ఏర్పాటు చేసి రానున్న ఎన్నికలను ఎదుర్కోవాలని సీడబ్ల్యూసీ భావిస్తోంది.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్వ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రయత్నం మేం రాహుల్‌గాంధీకి అండగా ఉంటా. భారత ప్రజాస్వామిక విలువలను దెబ్బతీస్తున్న ఈ ప్రమాదకరమైన పరిపాలన నుంచి మన ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీని సమర్ధంగా ఎదుర్కొనేందుకు సంకీర్ణ రాజకీయాలు, ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీలతో అవగాహన వంటి కీలక బాధ్యతలు రాహుల్‌ భుజాన వేసుకున్నారు. ప్రస్తుత సీడబ్ల్యూసీలో సోనియా, మన్మోహన్, ఆజాద్, మోతీలాల్‌ వోరా, ఖర్గే, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్, అంబికా సోనీ, ముకుల్‌ వాస్నిక్, కేసీ వేణుగోపాల్‌ తదితరులున్నారు.



Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)