amp pages | Sakshi

విష ప్రచారాన్ని తిప్పికొట్టాలి

Published on Sat, 10/27/2018 - 03:12

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధిపై జరుగుతున్న విష పచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల అనంతరం మరోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిందని.. ఈసారి కేసీఆర్‌ నాయకత్వానికి జై కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ఓ హోటల్‌లో శుక్రవారం మేధావుల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘దశాబ్దన్నరపాటు అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ప్రస్తుతం సరైన మార్గంలోనే ముందుకెళ్తోంది.

తెలంగాణ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షల మేరకు పని చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా వేగంగా దూసుకెళ్తోంది. తెలంగాణలో తొలి ప్రభుత్వం ఏర్పడ్డ వారం రోజుల్లోనే 7 మండలాలను ఏపీలో విలీనం చేస్తూ తెరలేపిన కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదించుకుంటూ అభివృద్ధిలో అగ్రభాగాన నిలుస్తున్నాం. ఆధిపత్య భావజాలం కలిగిన పాలకపక్షాలతో పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. రాష్ట్రంలోని ప్రతిపక్షాల సంకుచిత మనస్తత్వంతో మరోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ ప్రజాకోర్టులో ప్రతిపక్షాలను ఎండగట్టేందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. సీఎం కేసీఆర్‌ అసాధారణ పాలనతో.. తెలంగాణ ఉద్యమానికి పునాది అయిన నీళ్లు, నిధులు, నియామకాల్లో సంపూర్ణ న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్నాం. తెలంగాణను కోటి ఎకరాల మాగానం చేయాలన్న లక్ష్యంతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ చేపట్టాం. మిషన్‌ భగీరథతో ఇంటింటికీ మంచి నీరు అందించే కార్యక్రమం దాదాపు పూర్తి కావొచ్చింది’అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ప్రతిపక్షాల అసలు రూపం బయటపెట్టండి
‘ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుంటే ప్రతిపక్ష పార్టీలు కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టులను, నియామక ప్రక్రియను కోర్టులతో అడ్డంకులు సృష్టించాయి. అభివృద్ధి యజ్ఞానికి అడ్డం పడుతున్న ప్రతిపక్ష పార్టీల అసలు రూపాన్ని ప్రజల ముందుపెట్టడంలో తెలంగాణ మేధోవర్గం అండగా నిలవాలి. ప్రాజెక్టుల్లో అవినీతి అంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలి. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును రూపొందించినప్పుడు 16 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండేది. దీన్ని 160 టీఎంసీలకు పెంచినందువల్లే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈపీసీ విధానంతో, మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరిట ప్రజల సొమ్ములను కొల్లగొట్టిన విషయాలను చర్చకు పెట్టాలి. ప్రాజెక్టులతో పాటు ప్రతి విషయంపైనా ప్రతిపక్షపార్టీ కోర్టుకు వెళ్లింది. తెలంగాణ ఆడబిడ్డలకు అందివ్వాల్సిన బతుకమ్మ చీరలను సైతం అడ్డుకున్నది. ప్రభుత్వం భవిష్యత్తు తరాల కోసం చేపట్టిన ప్రాజెక్టుల కోసం నిధులు ఖర్చు చేస్తుంటే అప్పులు చేస్తోందని దుష్ప్రచారం చేస్తున్నారు. కుటుంబ పాలన అంటూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌.. అవినీతి, బంధుప్రీతికి, కుటుంబ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలను, కార్యక్రమాలను అడ్డుకుంటూ.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీల డొల్లతనాన్ని ప్రజలకు తెలియజేయాలి’అని మంత్రి కేటీఆర్‌ మేధావులను కోరారు.


కేటీఆర్‌తో అప్పిరెడ్డి భేటీ
హుజూర్‌నగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏహెచ్‌ఆర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు అన్నపరెడ్డి అప్పిరెడ్డితో పాటు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ నేతలు పలువురు శుక్రవారం కేటీఆర్‌తో సమావేశమయ్యారు. హుజూర్‌నగర్‌లో పార్టీ పరిస్థితిని, ఎన్నికల స్థితిగతులను అప్పిరెడ్డి వివరించారు. ఆరె కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టిపల్లి శివాజీ కేటీఆర్‌ సమక్షంలో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు.

కార్పొరేషన్ల చైర్మన్లు నాగుర్ల వేంకటేశ్వర్‌రావు, లింగంపల్లి కిషన్‌రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రైవేటు జూనియర్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. విద్యా రంగానికి రాష్ట ప్రభుత్వం చేసిన కృషి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు మద్దతు తెలపాలన్న కేటీఆర్‌ వినతిని నరేందర్‌రెడ్డి అంగీకరించారు. మాజీ ఎమ్మెల్యే గంగుల కమలా కర్‌తో కలసి ఆయన కేటీఆర్‌తో భేటీ అయ్యారు.

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)