amp pages | Sakshi

బాబు నుంచి హామీ ఏదైనా తీసుకున్నారా?

Published on Sat, 11/10/2018 - 14:47

సాక్షి, ఇబ్రహీంపట్నం : మహాకూటమిని వేదికగా చేసుకుని తాజా మాజీ మంత్రి హరీష్‌రావు మరోసారి విమర్శల వర్షం కురిపించారు. పాలమూరు దిండి ప్రాజెక్టు అక్రమైనదని కేంద్ర మంత్రి ఉమా భారతికి గతంలో లేఖ రాసిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణలో ఏవిధంగా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఆంధ్ర ప్రభుత్వం నిన్న దిండి ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. దానిని ఖచ్చితంగా అడ్డుకుంటామని ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే వారికి మనం ఓట్లు ఎందుకు వెయ్యాలి. చంద్రబాబు తెలంగాణలో ఒక్కమాట.. ఆంధ్రలో ఒక్కమాట మాట్లాడుతున్నారు. మహాకూటమికి ఓటేస్తే మన అస్థిత్వాన్ని బాబు దగ్గర తాఖట్టు పెట్టినట్టే. కూటమిలో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చంద్రబాబు వద్ద ఏమైనా హామీ తీసుకున్నారా?. రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పూర్తి చేయాలంటే కేసీఆర్‌కు ఓటు వేయ్యాలి. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఢిల్లీ పోతుంది. టీడీపీకి వేస్తే అమరావతి.. టీజేఎస్‌కు వేస్తే వృధా అవుతుంది’’ అని పేర్కొన్నారు.


ఎన్నో పదవులు త్యాగం చేశా..
ఆయన మాట్లాడుతూ.. ‘‘సంక్షేమం​ కావాలంటే టీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి. సంక్షోభం కావాలంటే మహాకూటమికి వేయ్యండి. తెలంగాణ కోసం ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలిన వాడిని. నన్ను ఎంత తిడితి అంత బలంగా తయారవుతా. డిసెంబర్‌ ఏడు తరువాత తెలంగాణలో టీడీపీ ఉండదు. ఉమ్మడి మహూబూబ్‌ నగర్‌ జిల్లాలో వలసలకు వెళ్లిన వారుతిరిగి వచ్చారు. కల్వకుర్తి ఇరిగేషన్‌ ద్వారా ఆ ప్రాంతం సస్యశ్యామలమైంది. వలసలు వెళ్లిన వాళ్లను మనం తీసుకువస్తే... కాంగ్రెస్‌ వాళ్లు పొలిమెర దాక పోయి టీడీపీ వాళ్లను తిరిగి తీసుకువస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు చంద్రబాబు చేతిలో ఉంది.. వారికి పట్టం కడితే మనకు నీళ్లు వస్తాయా?. గత నాయకులు తెలంగాణ రైతులను పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి. ఏ రాష్ట్రంలో అభివృద్ది చేయని చెరువులను మనం సాకారం చేసుకున్నాం’’ అని అన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)