amp pages | Sakshi

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

Published on Thu, 07/26/2018 - 03:47

లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి ప్రతినిధి, విజయనగరం/ కాశీబుగ్గ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం యవత కదం తొక్కింది. రాష్ట్రంలో విద్యార్థి, యువజన సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు పలు చోట్ల పెద్ద ఎత్తున మానవహారాలు చేపట్టారు. బుధవారం విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో వందలాది మంది విద్యార్థులు మానవహారంగా ఏర్పడి, ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆమ్‌ ఆద్మీ, అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విభజన హామీలన్నీ అమలు చేస్తున్నామని బీజేపీ పార్లమెంటులో చెప్పడం సిగ్గుచేటన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ.. విద్యార్థులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని హెచ్చరించారు. సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలను అమలు చేసి తీరాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, పీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్‌ గంగాధర్‌తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ బస్‌స్టాండ్‌ వద్ద వందలాది మంది బుధవారం మానవహారం చేపట్టారు. అలాగే విజయనగరం జిల్లాలో, పార్వతీపురంలో విద్యార్థులు ఆందోళన చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్, రాష్ట్రంలో జాతీయ విద్యా సంస్థలను, జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకుడు, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మద్దిల వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఎస్‌ఎఫ్‌ఐ నేతల అరెస్టు 
సాక్షి, గుంటూరు: ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరు ఐలాండ్‌ సెంటర్‌లో మానవహారం నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వారిని అరెస్టు చేసి చెంపలపై కొట్టడం వివాదానికి దారితీసింది. వివరాల్లోకెళ్తే.. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులు పొన్నూరులో మానవహారం నిర్వహించారు. పోలీసులు వచ్చి మానవహారాన్ని విరమించాలని కోరడంతో ఎస్‌ఎఫ్‌ఐ నేతలు ఎస్‌.కె.జాఫర్‌ఖాన్, ఎం.కిరణ్, తిరుమలరెడ్డి విద్యార్థులను పంపివేశారు. ఇదే తరుణంలో అక్కడకు వచ్చిన పొన్నూరు పోలీసులు ముగ్గురిని బలవంతంగా తమ వాహనంలో ఎక్కించుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ వీరిని అసభ్యపదజాలంతో దూషిస్తూ చెంపలపై తీవ్రంగా కొట్టడమే కాకుండా ఒంటిపై ఉన్న బట్టలన్నీ తీయించి లాకప్‌లో పడేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నేతలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు భగవాన్‌దాస్‌తోపాటు మరికొందరు గుంటూరు రూరల్‌ జిల్లా ఏఎస్పీ వరదరాజులును కలిసి ఫిర్యాదు చేశారు. పోలీసులు కొట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య, సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు ఖండించారు.  

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)