amp pages | Sakshi

కేసీఆర్‌ను మించిన లౌకికవాది లేరు

Published on Sat, 11/17/2018 - 01:56

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మించిన లౌకికవాది లేరని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎక్కడాలేని విధంగా మొట్టమొదట సిద్దిపేటలో ఇక్బాల్‌ మినార్‌ కట్టించారని చెప్పారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ వంద సీట్లతో గెలిచి కేసీఆర్‌ మరోసారి సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు అబిద్‌ రసూల్‌ఖాన్, ఖలీల్‌ ఉర్‌ రెహమాన్, వారి అనుచరులు తెలంగాణ భవన్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్‌ వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వా నించారు. అబిద్‌ రసూల్‌ఖాన్, ఖలీల్‌ రెహమాన్‌ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య స్నేహం ఉందని ఆరోపిస్తున్న చంద్రబాబుకు కాంగ్రెస్‌ మైనారిటీ నేతలు తమ పార్టీలో చేరి చెంప చెళ్లుమనిపించారని అన్నారు. 

టీఆర్‌ఎస్‌ మంచి పార్టీ: మహమూద్‌అలీ 
టీఆర్‌ఎస్‌ అంతటి మంచి పార్టీ దేశంలోనే లేదని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సీఎం కేసీఆర్‌ ముస్లింలను కంటికి రెప్పలా కాపాడుతున్నారని, ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. 

కాంగ్రెస్‌ జోకర్ల పార్టీ: రసూల్‌ఖాన్‌ 
కాంగ్రెస్‌ జోకర్ల పార్టీగా మారిందని అబిద్‌ రసూల్‌ఖాన్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో పనిచేస్తోందన్నారు. ముస్లింలు ఎన్నికల్లో గెలవరని కాంగ్రెస్‌ వారికి టికెట్లు ఇవ్వట్లేదని, క్రిమినల్‌ కేసులు ఉన్న వారికే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను స్వాహా చేసిన షబ్బీర్‌అలీకి కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. త్వరలోనే షబ్బీర్‌ బండారం బయట పెడతానని చెప్పారు. 

కాంగ్రెస్‌లో బౌన్సర్లే మిగిలారు: దానం నాగేందర్‌ 
కాంగ్రెస్‌లో ఎవరికీ న్యాయం జరగలేదని ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ అన్నారు. గాంధీభవన్‌ నుంచి కార్యకర్తలను బయటికి పంపారని, ఆ పార్టీలో బౌన్సర్లే మిగిలారన్నారు. కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు.

రాష్ట్రాన్ని అమ్ముకుంటారు: కేటీఆర్‌
తెలంగాణభవన్‌లో రోజూ వేలాది మందితో చేరికలు జరుగుతుంటే గాంధీభవన్‌ గేట్లకు తాళాలు వేశారని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. టికెట్ల పంపిణీ సమయంలో గాంధీభవన్‌ దగ్గర, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటి దగ్గర బౌన్సర్లే ఉంటున్నారని చెప్పారు. రూ.3 కోట్లకు టికెట్‌ అమ్ముకుంటున్నవారు పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకోరా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణను చంద్రబాబుకు అమ్ముకోరనే గ్యారంటీ ఉందా అన్నారు. కోదాడ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బొల్లం మల్లయ్యయాదవ్, తన అనుచరులతో కలసి తెలంగాణభవన్‌లో శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కేటీఆర్‌ పార్టీ కండువా కప్పి వారిని టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ‘రాహుల్‌ గాంధీ స్వయంగా పంపిన కాంగ్రెస్‌ నేత రూ.3 కోట్లు డిమాండ్‌ చేశారని 30 ఏళ్లు ఆ పార్టీలో పనిచేసిన బడుగువర్గాల నేతలు ఆరోపించారు. వారి టికెట్లు ఢిల్లీ, అమరావతిలో ఖరారయ్యాయి.

కాంగ్రెస్‌లో 40 మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. నెలన్నరకు ఒక్కరు చొప్పున పంచుకుంటారు. సీల్డు కవర్‌ సీఎం కావాలా? సింహం లాంటి కేసీఆర్‌ కావాలా? 67 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనను, నాలుగేళ్ల కేసీఆర్‌ పాలనను పోల్చుకొని ఓటేయండి. మహాకూటమితో మల్లయ్యయాదవ్‌కు అన్యాయం జరిగింది. కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేసి తాను బలహీనవర్గాల గొం తుకగా ఉంటానని మల్లయ్యయాదవ్‌కు భరోసా ఇచ్చారు. కోదాడలో గులాబీ జెండా ఎగరాలి. కోదాడలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులు ఒకే వేదిక మీదున్నారు. అందరూ కలసికట్టుగా కోదాడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించుకోవాలి’అని పిలుపునిచ్చారు.  

ఉత్తమ్‌ భార్యకు ఎలా టికెట్‌ ఇప్పించుకున్నారు: కవిత
టీఆర్‌ఎస్‌ను కుటుంబ పార్టీ అని విమర్శించే ఉత్తమ్‌ ఆయన భార్యకు టికెట్‌ ఎలా తీసుకుంటారని ఎంపీ కవిత ప్రశ్నించారు. ఉత్తమ్‌ తన భార్యకు టికెట్‌ ఉపసంహరించుకోవాలని, అప్పుడైనా ఆయనకు గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో విలేకరులతో కవిత ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కోదాడలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్‌కు కొత్తగా సెటిలర్లపై ప్రేమ పుట్టుకొచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో కమ్మ వర్గానికి అన్యాయం జరిగిందని, రేణుకాచౌదరి ఆ పార్టీకి రాజీనామా చేస్తారని వింటున్నానని చెప్పారు. సెటిలర్ల్లంతా టీఆర్‌ఎస్‌వైపే ఉంటారన్నారు. టీఆర్‌ఎస్‌ వందకుపైగా స్థానాలు గెలుచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో టీడీపీని తిరస్కరిస్తారన్నారు. జగిత్యాల స్థానాన్ని గెలిచి కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకుంటామన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)